శభాష్ అహ్మద్ : ఐదుగురికి జీవం పోసి .. ఊపిరొదిన వీరుడు
శ్రీనగర్ : తానో పర్యాటక గైడ్ .. కానీ తన బోటు మునగడంతో పడవలో ఉన్న పర్యాటకులను రక్షించారు. కానీ తాను మాత్రం ఆ గాలి దుమారంలో చిక్కుకొని .. విగతజీవిగా మారాడు. సుందర ప్రాంతం కశ్మీర్లో ఈ ఘటన జరిగింది. దార్ తెగువపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ప్రదర్శించిన ధైర్య, సాహసాలను ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు.
బోటు బోల్తా ..
కశ్మీర్ లోని మవూర పహల్గాం వద్ద గల లిద్దార్ పర్యాటక క్షేత్రం. ఇక్కడున్న నదీలో విహరించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. ఎప్పటిలాగే ఐదుగురు పర్యాటకులు శుక్రవారం వచ్చారు. వీరికి గైడ్ గా రావు అహ్మద్ దర్ పనిచేశారు. నిన్న నదీలో విహరిస్తుండగా బోటు బోల్తాపడింది. ఈతగాడైన అహ్మద్ దర్ .. ఐదుగురు పర్యాటకులను కాపాడారు. కానీ అప్పటికే బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో అతను ఒడ్డుకు చేరుకోలేకపోయాడు. ఈ విషయాన్ని పర్యాటకులు తెలియజేయడంతో ఇవాళ ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. అహ్మద్ దర్ మృతదేహన్ని లిద్దార్లో గల భవానీ బ్రిడ్జీ వద్ద గుర్తించి .. వెలికితీశారు. పంచనామా చేసి మృతదేహన్ని దర్ .. బంధువులకు అప్పగించారు.

శభాష్ అహ్మద్ ...
తనతో ఉన్న పర్యాటకులను కాపాడి .. ప్రాణాలు విడవడంపై టూరిస్ట్ గైడ్ ధైర్య సాహసాలపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ప్రదర్శించిన ధైర్యం మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తోందని అనంత్ నాగ్ డీసీపీ పేర్కొన్నారు. అతని కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నిపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి. కోల్పోయిన దర్ ను తిరిగి తీసుకురాలేమని .. కానీ ఆర్థికంగా చేయూతనిచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశారు. ఇటు దార్ తెగువను నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా శ్లాఘించారు. నదిలో బోటు బోల్తా పడిన పర్యాటకులను కాపాడిన తీరు అమోఘం, సెల్యూట్ అహ్మద్ దర్ అని ట్వీట్ చేశారు. అతని కుటుంబానికి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు. విధి నిర్వహణలో దర్ చూపిన తెగువ .. భావితరాలకు ఆదర్శనీయమని ప్రశంసించారు.













Click it and Unblock the Notifications