బిజెపిలో చేరిన ట్రిపుల్ తలాక్ పిటిషనర్ ఇష్రత్ జహన్
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ విషయమై సు,ప్రీంకోర్టులో కేసు దాఖలు చేసిన ఇష్రత్ జహన్ ఆదివారం నాడు బిజెపిలో చేరారు. ఈ విషయాన్ని బిజెపి బెంగాల్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయంతన్ బసు ప్రకటించారు. ఇష్రత్ జహన్ను త్వరలోనే ఘనంగా సన్మానించనున్నట్టు బసు ప్రకటించారు.
ట్రిపుల్ తలాక్ నిరసిస్తూ సుప్రీంకోర్టులో పోరాటం చేసిన ఐదుగురు పిటిషనర్లలో ఇష్రత్ ఒకరు. దుబాయ్ నుండి భర్త ఫోన్లో ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పారు. దీంతో ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా ఆమె న్యాయపోరాటానికి దగింది.

గత ఏడాది ఆగస్టు 22న సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమంటూ తేల్చింది. కేంద్ర ప్రభుత్వం కూడ ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా బిల్లు తీసుకువచ్చింది. బిజెపిలో చేరిన తర్వాత ఇష్రత్ జహన్ మాత్రం ఈ విషయమై స్పందించలేదు.
మరో వైపు ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లు ముస్లిం మహిళలకు స్వేచ్ఛను ప్రసాదించనుందని ప్రధానమంత్రి మోడీ అభిప్రాయపడ్డారు.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications