పార్టీ టిక్కెట్ల లోల్లి, బీఎస్పీ నాయకులకు చెప్పుల హారం, గాడిద మీద ఊరేగింపు, వైరల్ !
జైపూర్: టిక్కెట్ల పంపిణి విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ)కి చెందిన ఇద్దరు జాతీయ స్థాయి నాయకులకు చెప్పులు, షూల హారం వేశారు. అంతటితో శాంతించని కార్యకర్తలు ఓ నాయకుడిని పార్టీ కార్యాలయం ముందు నుంచి గాడిద మీదఊరేగించి కసి తీర్చున్న సంఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది. బీఎస్పీ నాయకులకు చెప్పుల హారం వేసి గాడిద మీద ఊరేగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బీఎస్పీ టిక్కెట్ల పంపిణి విషయంలో డబ్బులు తీసుకుని టిక్కెట్లు అమ్ముకున్నారని కార్యకర్తలు అనుమానించారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నాయకులకు పార్టీలో పెద్దపీట వేస్తున్నారని బీఎస్పీ కార్యకర్తలు అసహనంతో ఊగిపోయారు.

మంగళవారం బీఎస్పీ జాతీయ సమన్వయకర్త (జాతీయ కోఆర్డినేటర్) రామ్ జీ గౌతమ్, బీఎస్పీ రాజస్ఘాన్ రాష్ట్ర మాజీ ఇన్ చార్జ్ నాయకుడు సీతారామ్ తదితరులు జైపూర్ లోని బనిపార్క్ సమీపంలోని పార్టీ కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు.
#WATCH Rajasthan: BSP workers blackened faces of party's national coordinator Ramji Gautam&former BSP state incharge Sitaram¶ded them on donkeys,in Jaipur today.The workers also garlanded them with shoes&alleged that these leaders were indulging in anti-party activities pic.twitter.com/Vjvn1kur2w
— ANI (@ANI) October 22, 2019
ఆ సమయంలో అక్కడికి పెద్దఎత్తున చేరుకున్న బీఎస్పీ కార్యకర్తలు రామ్ జీ గౌతమ్, సీతారామ్ లకు చెప్పులు, షూల హారాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. తరువాత రామ్ జీ గౌతమ్ అక్కడి నుంచి తప్పించుకోవడంతో సీతారామ్ ను కార్యకర్తలు పట్టుకున్నారు.
బీఎస్పీ కార్యాలయం ముందు సీతారామ్ కు చెప్పుల హారం వేసి అక్కడి నుంచి గాడిద మీద ఊరేగించారు. డబ్బుల కోసం బీజేపీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి పార్టీ టిక్కెట్లు విక్రయిస్తున్నారని, గత ఐదు సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన మామ్మల్ని పట్టించుకోవడం లేదని బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు.
తాము ఎన్ని సార్లు ధర్నాలు చేసిన పార్టీ నాయకురాలు మాయావతికి సమాచారం ఇవ్వకపోవడం వలనే ఇలా చేశామని కార్యకర్తలు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న మాయావతి కాంగ్రెస్ పార్టీ వలనే ఇంత జరిగిందని అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలా సిగ్గు చోటు, ఇలా జరగకుండా ఉండాల్సిందని, తమ పార్టీకి చెడ్డపేరు తీసుకురావాలని కొందరు ఇలా చేశారని మాయావతి ఆరోపించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications