కశ్మీర్ లో కొనసాగుతున్న తుపాకుల మోత.. ఒక్కరోజే రెండు ఎన్‌కౌంటర్లు

శ్రీ నగర్ : కశ్మీర్ తుపాకుల మోతతో దద్ధరిల్లుతోంది. మంగళవారం ఒక్కరోజే రెండు ఎన్‌కౌంటర్లు జరగడం గమనార్హం. తెల్లవారుజామున కుల్గాం జిల్లాలోని రెద్వనీ ఏరియాలో సైన్యం సోదాలు చేపట్టింది. దీంతో అలర్టైన టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. అటు భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులతో పాటు ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.

అటు ఆ ఎన్‌కౌంటర్ కొనసాగుతుండగానే.. ఇటు సౌత్ కశ్మీర్ పుల్వామా సమీపంలోని ట్రోల్ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ మొదలైనట్లు తెలుస్తోంది. ముగ్గురు ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో భద్రతా దళాలు ఆ పరిసరాలను చుట్టుముట్టాయి. అయితే టెర్రరిస్టులు జనావాసాల మధ్య ఉండటంతో ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది.

two encounters took place on tuesday in kashmir

వరుస ఎన్‌కౌంటర్లతో కశ్మీర్ తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. ఆదివారం షోపియాన్ లో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఏడుగురు టెర్రరిస్టులతో పాటు స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్‌కౌంటర్ లో టెర్రరిస్ట్ కీలక నేతలను సైన్యం అంతమొందించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+