వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయిపై రేప్, హత్య కేసు: మరో ఇద్దరు అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

జల్పాయ్‌గురి: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అమ్మాయిపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. జల్పాయ్‌గురి జిల్లాలోని ధూప్‌గురి రైల్వే ట్రాక్స్‌పై గత వారం ఓ అమ్మాయి శవం బయటపడిన విషయం తెలిసిందే.

గత రాత్రి ఇద్దరిని అరెస్టు చేసినట్లు సిలిగురి రైల్వే పోలీసు ఎస్పీ దేవశీష్ సర్కార్ మంగళవారం ఆ విషయం చెప్పారు. ఇద్దరి అరెస్టుతో ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేసినట్లయింది. ఈ ఇద్దరి పేర్లను అమ్మాయి తండ్రి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సర్కార్ చెప్పారు.

Two more arrested in suspected rape and murder of girl

ఈ కేసులో మొత్తం 13 మంది పేర్లను చేర్చారు. ఇంతకు ముందు మైనర్ బాలుడితో పాటు ముగ్గురిని అరెస్టు చేశారు. ట్రాక్టర్ విషయంలో డబ్బులు చెల్లించనందుకు తన తండ్రిని ఇబ్బంది పెడుతున్నవారితో సంప్రదింపులు జరపడానికి అమ్మాయి ఆ రోజు బయలుదేరింది.

రైల్వే ట్రాక్ వద్ద పడి ఉన్న అమ్మాయిని గుర్తించిన తర్వాత ఆమె తండ్రి 13 మందిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అత్యాచారం, హత్య, అపహరణ కింద సెప్టెంబర్ 2వ తేదీన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

English summary
Two more persons have been arrested in connection with the suspected rape and murder of a girl whose body was found near the railway tracks at Dhupguri in Jalpaiguri district last week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X