పట్టపగలు తుపాకులకు పని, ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల హత్య, కారులో?
కర్ణాటకలోని హాసన్లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి మరో వ్యక్తిని కాల్చి చంపి తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మొదట పోలీసులు అనుకున్నారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇద్దరిని మరి కొందరు పట్టపగలు కాల్చి చంపేసి తప్పించుకుని వెళ్లిపోయారని అనుమానం రావడంతో హాసన్ తో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు నాకాబంది కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన హాసన్ నగరంలోని హోయసళ నగర్లో చోటుచేసుకుంది. ఈ సంఘటన గురువారం మద్యాహ్నం జరిగింది. ఓవ్యక్తి వచ్చి కారును ఖాళీ ప్రదేశంలో ఆపాడు. కారులో ఉన్న వాళ్లు దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడాడు. అంతలో అకస్మాత్తుగా కారు దగ్గర తుపాకీ నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. ఈ శబ్ధం విని స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలు షాక్ అయ్యారు. తుపాకి కాల్పుల శబ్దం విన్న ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు.

హాసన్ లోని కే.ఆర్. పురం స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యలు జరిగిన ప్రాంతంలో పోలీసులు కొన్ని సాక్షాలు సేకరించారు. బెంగళూరుకు చెందిన ఆసిఫ్, హాసన్కు చెందిన షౌకత్ అలీలు హత్యకు గురైనారని పోలీసులు అంటున్నారు. వీరిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, హాసన్లో సైట్ చూసేందుకు వచ్చి కారులో కూర్చుని చాలా సేపు మాట్లాడుకున్నారు.
ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య గొడవ మొదలైంది. ఆ సందర్బంలో తుపాకీ పట్టుకున్న వ్యక్తి ఆసిఫ్, షౌకత్ ఆలీలపై కాల్పులు జరిపారు. హత్య చేసిన వ్యక్తులను స్థానికులు ఎవ్వరూ చూడలేదని పోలీసులు అంటున్నారు. వ్యాపార లావాదేవీల కారణంగా జంట హత్యలు జరిగి ఉంటాయని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఒక శవం కారులో ఉందని, మరొక శవం కారు ముందు భాగంలో నేల మీద పడి ఉందని పోలీసు అధికారులు తెలిపారు. హాసన్ నగరంలో పట్టపగలు ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు హత్యకు గురికావడం కలకలం రేపింది.
-
పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించినట్లు అసెంబ్లీ ప్రకటించిన సీఎం -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా?












Click it and Unblock the Notifications