మహా సంక్షోభం: రంగంలోకి రష్మి థాకరే.. రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో భేటీ.. తిరిగి రావాలంటూ..
మహారాష్ట్రలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎంత చెప్పినా వినడం లేదు. వారిని వెనక్కి రప్పించేందుకు ఉద్దవ్ థాకరే చేయని ప్రయత్నం లేదు. ఇక చేసేదేమీ లేక.. రాజీనామా కూడా చేస్తానని చెప్పారు. అయినా రెబల్ ఎమ్మెల్యేల్లో ఉలుకు లేదు పలుకు లేదు. ఉద్దవ్ కుమారుడు ఆదిత్య థాకరే కూడా.. వారికి వార్నింగ్ ఇచ్చాడు. అయినా నో యూజ్.. సో ఉద్దవ్ భార్య రష్మి థాకరే రంగంలోకి దిగారు. రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో మాట్లాడుతున్నారు. భర్తలను ఒప్పించి.. తిరిగి రావాలని కోరుతున్నారు. మరీ ఈ ప్రయత్నం అయినా సఫలం అవుతుందా లేదో చూడాలీ..

రంగంలోకి రష్మి..
సీఎం ఉద్ధవ్ థాకరే భార్య సతీమణి రష్మీ రంగంలోకి దిగారు. తిరుగుబాటు ఎగురవేసి.. అసమ్మతి కూటమిలో చేరిన ఎమ్మెల్యేల భార్యలను కలుస్తున్నారు. ఒక్కొక్కరి ఇంటికి వెళ్తున్న రష్మీ థాకరే.. వారి భర్తలను ఒప్పించాలని కోరుతున్నారు. శనివారం శివసేన జాతీయ కార్యవర్గ సమాశం జరిగింది. ఇందులో రెబల్స్పై చర్యలు తీసుకొనేందుకు ఉద్ధవ్కు అధికారం అప్పజెప్పుతూ తీర్మానం చేశారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోకూడదని, వేచి చూడాలని నిర్ణయించింది. ఏ రాజకీయ వర్గం కూడా శివసేన పేరు, బాల్ థాకరే పేరును ఉపయోగించుకోవద్దని మరో తీర్మానం చేసింది.

తండ్రి పేరుతో అడగండి..
ఓట్లు అడిగేవారు.. తండ్రి పేరుతో ఓట్లడగండి.. కానీ బాల్ థాకరే పేరు వాడొద్దని ఉద్ధవ్ థాకరే రెబల్స్కు స్పష్టం చేశారు. ఏక్నాథ్ షిండే సహా 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి శనివారం సమన్లు పంపించారు. వారిని ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన ఫిర్యాదులపై సోమవారంలోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోరారు.

తండ్రి పేరుతో అడగండి..
ఓట్లు అడిగేవారు.. తండ్రి పేరుతో ఓట్లడగండి.. కానీ బాల్ థాకరే పేరు వాడొద్దని ఉద్ధవ్ థాకరే రెబల్స్కు స్పష్టం చేశారు. ఏక్నాథ్ షిండే సహా 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి శనివారం సమన్లు పంపించారు. వారిని ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన ఫిర్యాదులపై సోమవారంలోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోరారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications