కాంగ్రెస్ది విభజించి పాలించే ఫార్ములా... అందుకే అధికారంకు దూరమైంది: ప్రధాని మోదీ
ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23కు కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ కామన్ మ్యాన్కు నిరాశే కలిగించింది. బడ్జెట్ మొత్తం డిజిటలైజేషన్ పైనే ఫోకస్ చేసినట్లుగా అనిపించింది. నిర్మలమ్మ బడ్జెట్ విజనరీ బడ్జెట్గా కొందరు కొనియాడగా... విపక్షాలు మాత్రం దుమ్మెత్తి పోశాయి. ఇక అంతకుముందు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సోమవారం రోజున ప్రధాని మోదీ లోక్సభలో మాట్లాడతారు. ఈ సందర్భంగా మోదీ విపక్షాలు చేసిన విమర్శలకు ధీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి మోదీ విపక్షాల విమర్శలకు ఎలాంటి సమాధానం ఇస్తారు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో పార్లమెంటు వేదికగా మోదీ ఎలాంటి చాణక్యతను ప్రదర్శిస్తారు అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. ఇక పార్లమెంటులో మోదీ ప్రసంగం మినిట్-టూ-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం..
Some people have a problem with 'Make in India' because, for them, it means that there will be no corruption, they won't be able to gather money...we have made an attempt to resolve all pending issues of the defence sector: PM Modi in Lok Sabha pic.twitter.com/NmJ5Q6wYVx
— ANI (@ANI) February 7, 2022