నాడు ఆర్టికల్ 370..నేడు మరో మిషన్: కాస్సేపట్లో కేంద్ర కేబినెట్ సమక్షానికి..రంగంలో అమిత్ షా.. !
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తోన్న భారతీయ జనతా పార్టీ మరో ప్రతిష్ఠాత్మక అంశాన్ని భుజానికెత్తుకోనుందా? ఇప్పటికే దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతోన్న ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతన అడుగును ముందుకే వేయబోతోందా? అనే ప్రశ్నలకు ప్రస్తుతం అవుననే సమాధానమే వినిపిస్తోంది. అదే- పౌరసత్వ సవరణ బిల్లు. కాస్సేపట్లో ఈ అంశం కేంద్ర కేబినెట్ సమక్షానికి రాబోతోంది. కేంద్ర కేబినెట్ లో ఈ బిల్లు విషయంపై చర్చించడానికి ముందే.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు.
ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సమావేశం కాబోతున్నారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు శర్బానంద సొనొవాల్ (అస్సాం), జొరంథంగా (మిజోరం) దీనికి హాజరు కానున్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి కూడా దీనికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ముగ్గురూ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలనేది కేంద్రప్రభుత్వం యోచన. దీనిపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల ఆధీనంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ నిరసనను వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమల్ నాథ్ (మధ్యప్రదేశ్), అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), అమరీందర్ సింగ్ (పంజాబ్), కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీన్ని వ్యతిరేకించారు.
ఆ తరువాత ఈ అంశంపై అమిత్ షా కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపించినప్పటికీ..పూర్తిగా ఎత్తేయలేదనే విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేసినట్టయింది. పౌరసత్వ సరవణ బిల్లుపై కేంద్ర కేబినెట్ లో చర్చించడం, దానిపై ఆమోదం తెలియజేయడానికి బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర కేబినెట్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications