Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉద్యోగులకు ఆ సౌకర్యాల తొలిగింపు - రేపటి నుంచి కొత్త నిబంధనలు : మార్గదర్శకాలు జారీ..!!

దాదాపు ఏడాదిన్నార కాలంలో కరోనా ప్రభావంతో ఉద్యోగ వ్యవస్థ ఎఫెక్ట్ అయింది. కరోనా నుంచి ఉద్యోగులకు రక్షణ కల్పించటానికి కేంద్రంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు పలు సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. అయితే, క్రమేణా కరోనా కేసులు సంఖ్య తగ్గుతూ వచ్చింది. అన్ని వ్యవస్థలు గాడిన పడుతున్నాయి. ఇక, ఈ నెల 8వ తేదీ నుంచి కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు సైతం పూర్తి స్థాయిలో పని చేసేందుకు తాజాగా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విధుల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది.

పూర్తి స్థాయిలో ఉద్యోగుల విధులు

పూర్తి స్థాయిలో ఉద్యోగుల విధులు

రేపటి నుంచి అంటే నవంబర్‌8 నుంచి కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించిన సౌకర్యాలన్నీ తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ ఉమేష్‌ కుమార్‌ భాటియా తెలిపారు. కేంద్రప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ ఉమేష్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..కరోనా మహమ్మారి కారణంగా కార్యాలయాలకు తక్కువ సంఖ్యలో ఉద్యోగులు విధులు నిర్వహించినట్లు తెలిపారు. తక్కువ సంఖ్యలో ఉద్యోగులతో పాటు పనిగంటల్ని తగ్గించినట్లు తెలిపారు. అయితే నవంబర్‌ 8నుంచి ఈ సౌకర్యాల్ని తొలగిస్తున్నట్లు తెలిపారు.

సౌకర్యాలు ఉప సంహరణ

సౌకర్యాలు ఉప సంహరణ

వాటితో పాటు కొత్త నిబంధనల్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. బయోమెట్రిక్ యంత్రం దగ్గర తప్పనిసరిగా శానిటైజర్ ఉండాలని స్పష్టం చేసారు. అదే విధంగా ఉద్యోగులందరూ హాజరు నమోదుకు ముందు, తర్వాత చేతుల్ని శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. బయోమెట్రిక్ హాజరు నమోదు చేసేటప్పుడు ఉద్యోగులు తమ మధ్య ఆరు అడుగుల దూరం పాటించాలని స్పష్టం చేసారు. ద్యోగులందరూ ఎల్లప్పుడూ మాస్క్ ధరించాలి లేదా ఫేస్ కవరింగ్ ధరించాలని నిర్దేశించారు. బయోమెట్రిక్ మిషన్ టచ్‌ప్యాడ్‌ను తరచుగా శుభ్రం చేయడానికి నియమించబడిన సిబ్బందిని నియమించాలని సూచించారు.

Recommended Video

    రాష్ట్రాలు కూడా సుంకాన్ని తగ్గిస్తే సామాన్యుడికి న్యాయం జరుగుతుందన్న వీహెచ్ || Oneindia Telugu
    అప్రమత్తత మాత్రం వీడవద్దంటూ

    అప్రమత్తత మాత్రం వీడవద్దంటూ

    బయోమెట్రిక్ యంత్రాలను బహిరంగ వాతావరణంలో ఉంచాలని..దీంతో పాటుగా..యంత్రం లోపల ఉంటే, తగినంత సహజ వెంటిలేషన్ ఉండాలని సూచించారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లోని న్యాయస్థానాల్లోనూ ప్రత్యక్ష విచారణ ప్రారంభం కాలేదు. ఈ నెల 8వ తేదీ నుంచి ఏపీలో ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని నిర్ణయించారు. కరోనా ప్రభావం తగ్గటంతో అన్ని వ్యవస్థలు తిరిగి యధా విధిగా పని చేస్తున్నాయి. ఇదే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేస్తోంది. ముప్పు తొలిగిపోలేదని..యూరప్ దేశాల్లో థర్డ్ వేవ్ విస్తరిస్తున్న వేళ...రక్షణ చర్యల్లో నిర్లక్ష్యం వద్దని హెచ్చరిస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+