రోడ్డు ప్రమాదం: కేంద్రమంత్రికి గాయాలు
పాట్నా: కేంద్రమంత్రి రాజీవ్ప్రతాప్ రూడీ రోడ్డుప్రమాదంలో గాయపడ్డారు. ఆదివారం అధికారిక పనుల నిమిత్తం బీహార్ రాష్ట్రంలోని సరన్ జిల్లా వెళ్లి.. తిరిగి పట్నా వస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనలో రూడీ గాయపడ్డారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే కేంద్రమంత్రిని పట్నాలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

మరోవైపు అసోంలో నిర్వహించిన తిరంగ యాత్రలో భారతీయ జనతా పార్టీ ఎంపీ కామాక్య ప్రసాద్ తాసా గాయపడ్డారు. తిరంగ యాత్రలో భాగంగా బైక్పైవెళ్తున్న ఆయన అదుపుతప్పి కిందపడటంతో గాయాలయ్యాయి. ఆయన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
కాగా, ఇటీవల మే నెలలో మరో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బైక్ పై వెళుతుండగా ఓ కారు రాసుకుంటూ వెళ్లడంతో ఆయన కందపడిపోయారు. దీంతో ఆయన గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications