కోర్టులో లొంగిపోయిన కేంద్రమంత్రి సంజీవ్ బల్యాన్
ముజఫర్నగర్: కోర్టులో విచారణకు హాజరుకాకపోవడంపై వారెంటు జారీ చేయడంతో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి సంజీవ్కుమార్ బల్యాన్ ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ కోర్టులో శుక్రవారం లొంగిపోయారు.
2013 ముజఫర్నగర్ అల్లర్ల కేసుకు సంబంధించిన ఈ కేసులో శుక్రవారం కోర్టు విచారణకు హాజరుకావాల్సి ఉండగా సంజీవ్ విచారణకు హాజరుకాలేదు. దీంతో కోర్టు బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో బల్యాన్ కోర్టులో లొంగిపోయారు.

కాగా, ఆ తర్వాత ఆయనకు బెయిల్ లభించింది. అడిషనల్ చీఫ్ జ్యుడిషీయల్ మేజిస్ట్రేట్ సీతారాం గత నవంబరు 24న జరిగిన విచారణలో బల్యాన్ సహా బిజెపి నేతలు భరతేంద్ర సింగ్, సురేశ్ రానా, విహెచ్ని నేత సాధ్వి ప్రాచీలు డిసెంబరు 18న కోర్టులో హాజరుకావాల్సిందిగా ఆదేశించారు.












Click it and Unblock the Notifications