Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాళ్ల దాడి ఎఫెక్ట్: కేంద్రమంత్రికి భద్రత పెంపు, జెడ్ క్యాటగిరీ ప్రొటెక్షన్

కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ బాగల్‌కు రక్షణ పెంచారు. నిన్న ఆయనకు యూపీలో ఛేదు అనుభవం ఎదురయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్పీ గుండాలు దాడి చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 30 మంది వరకు అదుపులోకి తీసుకున్నారు. ఉమాకాంత్ యాదవ్, బిట్టు.. ఇతరులపై కేసు నమోదు చేశారు.

మొయిన్ పురి జిల్లా కర్హాల్ వద్ద కొందరు దుండగులు సత్యపాల్ సింగ్ కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు. ఆయన కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడి నుంచి ఎస్పీ అభ్యర్థి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. దాడి నుంచి కేంద్రమంత్రి తప్పించుకున్నారు. కానీ అతని వాహనం అద్దం మాత్రం పగిలిపోయింది. ఘటనను బీజేపీ ఖండించింది. ఘటన వెనక ఎస్పీ గుండాలు ఉన్నారని డిప్యూటీ సీఎం కేపీ మౌర్య ఆరోపించారు.

 Union minister SP Baghel gets Z category security after attack on convoy

ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలా చేశారని తెలిపారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులు ఎంతటి వారైనా వదలబొమని చెప్పారు. ఇటు మరో బీజేపీ ఎంపీ గీతకు కూడా నిరసన ఎదురయ్యింది. ఈ రెండు ఘటనలను ఆయన ఉదహరించారు.

థానా కర్హాల్‌లో గల రాహమతుల్లాపూర్ వద్ద దాడి జరిగింది. ప్రచారం ముగించుకొని వచ్చే సమయంలో దాడి జరిగింది. ఇతర పార్టీ నేతలతో కలిసి అటికుల్లాపూర్ గ్రామానికి వెళుతున్నారు. అక్కడ అప్పటికే కొందరు ఉన్నారు. వెంటనే రాళ్లతో దాడి చేశారు. వెంటనే రాళ్లతో దాడి చేశారు. దీంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+