నిత్యానందుడి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస పౌరసత్వం కావాలా నాయనా..!!
వివాదాస్పద స్వామి నిత్యానంద నెలకొల్పిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశం ఇ-పౌరసత్వానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది.
న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద స్వామి నిత్యానంద.. ఓ సొంత దేశాన్నే సృష్టించుకున్నారు. ఈక్వెడార్ సమీపంలోని ఓ చిన్న ద్వీపంలో తిష్ఠ వేశారు. ఆ ద్వీపాన్ని హిందూ దేశంగా ప్రకటించారు. దానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసగా పేరు పెట్టారు. ఇప్పుడు తాజాగా పౌరసత్వాన్ని ఆహ్వానిస్తోన్నారాయన. ఇ-పౌరసత్వాన్ని పొందడానికి అవసరమైన వివరాలను విడుదల చేశారు.

2019 నుంచి..
2019లో స్వామి నిత్యానంద- యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని ప్రకటించారు. అక్కడి నుంచే తన కార్యకలాపాలను కొనసాగిస్తోన్నారు. ప్రసంగాలను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై పోస్ట్ చేస్తోన్నారు. నిత్యానంద దేశానికి వెళ్లాలంటే ప్రత్యేక పాస్ పోర్ట్ అవసరం అవుతుంది. సొంతంగా జాతీయ పతాకాన్ని, జాతీయ ధ్వజాన్ని సైతం రూపొందించుకున్నారు. తాను ధ్యానంలో కూర్చున్న ఫొటోను జాతీయ చిహ్నంగా ప్రకటించారు.

దేశంగా గుర్తింపు..
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని అధికారికంగా గుర్తించాలని కోరుతూ నిత్యానంద.. ఇదివరకే ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేశారు. దీనికి అవసరమైన ఫార్మాలిటీస్ అన్నింటినీ పూర్తి చేశారు. ప్రపంచంలో హిందూ దేశాల సంఖ్య తగ్గుతోందని, అందుకే తాను కైలాస పేరుతో ప్రత్యేకంగా ఓ దేశాన్ని సృష్టించాల్సి వచ్చిందంటూ అప్పట్లో చెప్పుకొచ్చారాయన. ఐక్యరాజ్య సమితిలో ఆయన ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తోంది.

జెనీవా భేటీలో ప్రత్యక్షం..
ఐక్యరాజ్య సమితికి చెందిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ తాజాగా స్విట్జర్లాండ్ లోని జెనీవాలో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధురాలు పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కైలాస తరఫున విజయప్రియ నిత్యానంద ఈ భేటీకి హాజరయ్యారు. కీలక అంశాలపై ప్రసంగించారు. విజయప్రియ నిత్యానందను ఐక్యరాజ్య సమితిలో శాశ్వత రాయబారిగా చెబుతున్నారు.

హిందూ ఆచార వ్యవహారాల పునరుజ్జీవం..
కైలాస దేశం- హిందువుల మొట్ట మొదటి సార్వభౌమధికార దేశమని విజయప్రియ అన్నారు. నిత్యానంద పరమశివం దీన్ని స్థాపించారని గుర్తు చేశారు. హిందూ నాగరికతతో పాటు 10,000 రకాల దేశీయ సంప్రదాయాలను పునరుజ్జీవింపజేస్తోన్నాడని చెప్పారు. ఇందులో ఆది, శైవ దేశీయ వ్యవసాయ తెగలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో నిత్యానంద- తీవ్ర వివక్షను ఎదుర్కొన్నారని, మానవ హక్కుల ఉల్లంఘనకు గురయ్యారని భారత్ ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు.
ఇ- సిటిజన్షిప్
ఈ భేటీ తరువాత నిత్యానంద కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ దేశ పౌరసత్వాన్ని పొందాలంటూ ప్రపంచవ్యాప్తంగా హిందువులకు పిలపునిచ్చారు. ఇ-సిటిజన్షిప్ వివరాలను వెల్లడించారు. దీనికోసం ప్రత్యేకంగా https://kailaasa.org/e-citizen/ వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ లింక్ ను క్లిక్ చేసి, అందులో ఉన్న వివరాలను భర్తీ చేయడం ద్వారా తమ దేశ ఇ-పౌరసత్వాన్ని పొందొచ్చని వివరించారు. తమదేశ పౌరసత్వాన్ని పొందాలంటూ నిత్యానంద ప్రపంచవ్యాప్తంగా హిందువులను ఆహ్వానించారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications