ఎయిర్ ప్యూరిఫయర్లపై 18 శాతం జీఎస్టీనా ? కేంద్రానికి హైకోర్టు చీవాట్లు..!
జాతీయ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ తీవ్రమవుతోంది. అలాగే దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లో సైతం గాలి నాణ్యత తగ్గుతోంది. దీంతో ప్రజలు శ్వాససంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలోనూ గాలి నాణ్యత పెంచే ఎయిర్ ప్యూరిఫయర్లపై కేంద్రం 18 శాతం జీఎస్టీ విధించడాన్ని ఢిల్లీ హైకోర్టు ఇవాళ తీవ్రంగా తప్పుబట్టింది. అంతే కాదు ప్రజల ప్రాణాల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంపై చీవాట్లు పెట్టింది.
మనం ప్రతీ రోజూ 21 వేల సార్లు గాలి పీలుస్తామని, ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యవసర స్దితికి చేరుకుందని ఢిల్లీ హైకోర్టు గుర్తుచేసింది. ఇలాంటి పరిస్ధితుల్లో అత్యవసర వస్తువు అయిన ఎయిర్ ప్యూరిఫయర్లపై 18 శాతం జీఎస్టీ విధించడం సరికాదని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు అక్షింతలు వేసింది. ఎయిర్ ప్యూరిఫైయర్లను వైద్య పరికరాలుగా తిరిగి వర్గీకరించాలని, దీనివల్ల అవి కనీస జీఎస్టీ 5 శాతం స్లాబ్ కిందకు వస్తాయని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గేదెలతో కూడిన డివిజన్ బెంచ్ విచారిస్తోంది.

పిటిషనర్ విజ్ఞప్తిపై స్పందించేందుకు సమయం కావాలని కేంద్రం చేసిన అభ్యర్ధనపై ఢిల్లీ హైకోర్టు మండిపడింది. సకాలంలో దీనిపై స్పందిస్తామంటూ చేసిన అభ్యర్ధనపై స్పందిస్తూ.. సకాలంలో అంటే ఏమిటి? వేలాది మంది చనిపోతే? ఈ నగరంలోని ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన గాలి అవసరం, మీరు దాన్ని అందించలేకపోయారని తెలిపింది. మీరు చేయగలిగేది కనీసం వారికి ఎయిర్ ప్యూరిఫైయర్లను అందుబాటులో ఉంచడమేనని గుర్తుచేసింది. అలాగే ప్రజలకు తక్షణ ఉపశమనం ఇచ్చే అవకాశం పరిశీలించాలని హైకోర్టు సూచించింది. ఈ ఎయిర్ ఎమర్జెన్సీ కాలంలో జాతీయ భద్రతా చట్టం కింద తాత్కాలిక చర్యగా మీరు ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీని ఎందుకు మినహాయించలేరని కోర్టు ప్రశ్నించింది.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications