ఎయిర్ ప్యూరిఫయర్లపై 18 శాతం జీఎస్టీనా ? కేంద్రానికి హైకోర్టు చీవాట్లు..!
జాతీయ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ తీవ్రమవుతోంది. అలాగే దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లో సైతం గాలి నాణ్యత తగ్గుతోంది. దీంతో ప్రజలు శ్వాససంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలోనూ గాలి నాణ్యత పెంచే ఎయిర్ ప్యూరిఫయర్లపై కేంద్రం 18 శాతం జీఎస్టీ విధించడాన్ని ఢిల్లీ హైకోర్టు ఇవాళ తీవ్రంగా తప్పుబట్టింది. అంతే కాదు ప్రజల ప్రాణాల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంపై చీవాట్లు పెట్టింది.
మనం ప్రతీ రోజూ 21 వేల సార్లు గాలి పీలుస్తామని, ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యవసర స్దితికి చేరుకుందని ఢిల్లీ హైకోర్టు గుర్తుచేసింది. ఇలాంటి పరిస్ధితుల్లో అత్యవసర వస్తువు అయిన ఎయిర్ ప్యూరిఫయర్లపై 18 శాతం జీఎస్టీ విధించడం సరికాదని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు అక్షింతలు వేసింది. ఎయిర్ ప్యూరిఫైయర్లను వైద్య పరికరాలుగా తిరిగి వర్గీకరించాలని, దీనివల్ల అవి కనీస జీఎస్టీ 5 శాతం స్లాబ్ కిందకు వస్తాయని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గేదెలతో కూడిన డివిజన్ బెంచ్ విచారిస్తోంది.

పిటిషనర్ విజ్ఞప్తిపై స్పందించేందుకు సమయం కావాలని కేంద్రం చేసిన అభ్యర్ధనపై ఢిల్లీ హైకోర్టు మండిపడింది. సకాలంలో దీనిపై స్పందిస్తామంటూ చేసిన అభ్యర్ధనపై స్పందిస్తూ.. సకాలంలో అంటే ఏమిటి? వేలాది మంది చనిపోతే? ఈ నగరంలోని ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన గాలి అవసరం, మీరు దాన్ని అందించలేకపోయారని తెలిపింది. మీరు చేయగలిగేది కనీసం వారికి ఎయిర్ ప్యూరిఫైయర్లను అందుబాటులో ఉంచడమేనని గుర్తుచేసింది. అలాగే ప్రజలకు తక్షణ ఉపశమనం ఇచ్చే అవకాశం పరిశీలించాలని హైకోర్టు సూచించింది. ఈ ఎయిర్ ఎమర్జెన్సీ కాలంలో జాతీయ భద్రతా చట్టం కింద తాత్కాలిక చర్యగా మీరు ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీని ఎందుకు మినహాయించలేరని కోర్టు ప్రశ్నించింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications