ఆయుధాల కోసం: యుపి 'బంగారు నిధి'పై కొత్త ట్విస్ట్
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని బంగారు నిధిపై కొత్త ట్విస్ట్. దౌండియా ఖేరా గ్రామంలోని ఓ కోట కింద వెయ్యి టన్నుల బంగరం ఉందని చెప్పిన స్వామి శోభన్ సర్కారు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో కోట వద్ద వారం రోజులుగా తవ్వకాలు జరుగుతున్నాయి. బంగారు నిధి కోసమే తవ్వకాలు జరుగుతున్నాయని ఇన్నాళ్లు వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు కేంద్రమంత్రి చంద్రేశ్ కుమార్ నిధి కోసం తవ్వడం లేదని చెప్పారు. కోట వద్ద బంగారు నిధి కోసం తవ్వకాలు జరగగడం లేదని 1857 ప్రాంతంలో ఉపయోగించిన ఆయుధాల కోసమని చెప్పారు.
ఈ ప్రాంతంలో లోహం ఉందని జిఎస్ఐ నివేదిక తెలిపిందని, ఆ లోహం ఏదని తాను చెప్పలేనని చంద్రేశ్ కుమార్ అన్నారు. అది బంగారం కావొచ్చు, వెండి కావొచ్చు, స్టీల్ కావొచ్చన్నారు.
ఈ ప్రాంతంలో తుపాకులు, విగ్రహాలు ఉన్నాయని, అలాగే నాడు ఉపయోగించిన ఆయుధాలు ఉన్నాయన్నారు. చారిత్రక ఆధారాలను వెలికి తీసే ప్రయత్నమని అభిప్రాయపడ్డారు.