రికార్డు: ఉత్తర్ ప్రదేశ్ లో 38 మంది మహిళ ఎమ్మెల్యేల విజయం, బిజెపి సభ్యులే ఎక్కువ
ఉత్తర్ ప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మహిళా ఎమ్మెల్యేలు విజయం సాధించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి 38 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించడం ఇదే ప్రథమం.
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో మహిళా ఎమ్మెల్యేలు విజయం సాధించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఇంత పెద్ద సంఖ్యలో మహిళా ఎమ్మెల్యేలు విజయం సాధించడం కూడ రికార్డేనని చరిత్ర చెబుతోంది.ఈ ఎన్నికల్లో 38 మహిళలు విజయం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.
ఏడు దశల్లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వివిద రాజకీయ పార్టీలు 96 టిక్కెట్లను మహిళలకు కేటాయించారు. ఈ ఎన్నికల్లో బిజెపి 43 స్థానాలను మహిళలకు కేటాయించింది.
అయితే 43 మంది మహిళా అభ్యర్థుల్లో 32 మంది విజయం సాధించారు. బిఎస్ పి , కాంగ్రెస్ పార్టీల నుండి ఇద్దరేసి చొప్పున ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.

సమాజ్ వాదీ పార్టీ, అప్నాదళ్ పార్టీల నుండి ఒక్కొక్క అభ్యర్థి ఈ దఫా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎన్నికల కమీషన్ లో ఉన్న రికార్డుల ప్రకారంగా ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో 20 మంది మహిళలు విజయం సాధించారు.
1991 అసెంబ్లీ ఎన్నికల్లో 31 మందికి గాను 10 మంది మాత్రమే అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1989 లో 18 మంది మహిళలు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.2007 లో జరిగిన ఎన్నికల్లో ముగ్గురు మాత్రమే మహిళలు విజయం సాధించారు.2012 ఎన్నికల్లో మహిళ ఎమ్మెల్యేలు 35 మంది మాత్రమే విజయం సాధించారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో 38 మంది మహిళలు విజయం సాధించారు.
అయితే ఈ ఎన్నికల్లో బిఎస్ పి 20 మంది మహిళలకు టిక్కెట్లు కేటాయించింది.2012 లో బిఎస్ పి 33 మంది మహిళలకు టిక్కెట్లను కేటాయించింది.ఈ దఫా సమాజ్ వాదీ పార్టీ 33 మంది మహిళలకు టిక్కెట్లను కేటాయించింది.కాంగ్రెస్ పార్టీ 11 మంది మహిళలకు టిక్కెట్లను కేటాయించింది.
2012 ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ 34 మంది మహిళలకు టిక్కెట్లు కేటాయిస్తే 22 మంది విజయం సాధించారు. 2017 ఎన్నికల్లో ఆ పార్టీ 42 మంది మహిళలకు టిక్కెట్లు కేటాయిస్తే కేవలం ఒక్కరు మాత్రమే విజయం సాధించారు.
బిజెపి ఈ దఫా 43 మంది మహిళలకు టిక్కెట్లను కేటాయించింది.అయితే ఇందులో 32 మంది విజయం సాధించారు. అయితే రికార్డు స్థాయిలో ఈ అసెంబ్లీకి మహిళలు ఎన్నిక కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన మహిళ ఎమ్మెల్యేలను ఆయన అభినందిస్తూ ట్వీట్ చేశారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications