వందేళ్ల తర్వాత: లక్నో మేయర్ పీఠంపై తొలిసారి మహిళా అభ్యర్థి..
లక్నో: ఉత్తరప్రదేశ్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో.. దాదాపు వందేళ్ల తర్వాత లక్నో మున్సిపల్ కార్పోరేషన్ మేయర్గా ఒక మహిళా అభ్యర్థి ఎన్నిక కానుండటం విశేషం.
ఇక్కడ అభ్యర్థులను నిలిపిన పార్టీలన్ని మహిళలనే బరిలో దింపడంతో మేయర్ పీఠం మహిళకే దక్కనుంది. 1916లో ఉత్తరప్రదేశ్ మున్సిపల్ యాక్ట్ వచ్చిన తర్వాత ఒక మహిళ లక్నో మేయర్ పీఠాన్ని దక్కించుకోనుండటం ఇదే తొలిసారి.

దేశానికి తొలి మహిళా సీఎం సుచేత కృపలానీ, అలాగే తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడును అందించిన ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో లక్నో మేయర్ పీఠాన్ని ఒక మహిళ దక్కించుకోవడానికి ఇంత కాలం పట్టడం గమనార్హం.
కాగా, లక్నో మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో సయుక్త భాటియా(బీజేపీ), ప్రేమ అవాస్తి(కాంగ్రెస్), బుల్ బుల్ గోదియాల్(బీఎస్పీ), ప్రియాంక మహేశ్వరి(ఆమ్ ఆద్మీ), మీరా వర్ధన్(ఎస్పీ) బరిలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ అభ్యర్థి అవాస్తి కాంగ్రెస్ నేత సురేంద్ర నాథ్ భార్య కాగా.. ఎస్పీ అభ్యర్థి వర్థన్ విద్యావేత్త ఆచార్య నరేంద్ర దేవ్ దగ్గరి బంధువు కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications