మాయావతి మౌనం. రాహుల్ రాయబారంపై ట్విస్ట్..

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 2027 అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. రాబోయే ఎన్నికల కోసం బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ)తో చేతులు కలపాలనే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలకు ఆదిలోనే గట్టి అడ్డంకి ఎదురైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పంపిన ప్రత్యేక రాయబారులను కలవడానికి బీఎస్‌పీ అధినేత్రి మాయావతి నిరాకరించడం ఇప్పుడు యూపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీతో (ఎస్పీ) కాంగ్రెస్ పొత్తు కొనసాగుతున్న తరుణంలోనే తెరవెనుక జరిగిన ఈ పొత్తుల రాజకీయం తీవ్ర ఊహాగానాలకు దారితీసింది.

మంగళవారం లక్నోలోని మాయావతి నివాసానికి కాంగ్రెస్ తరపున ఒక కీలక ప్రతినిధి బృందం చేరుకుంది. బారాబంకి ఎంపీ తనుజ్ పూనియా, కాంగ్రెస్ షెడ్యూల్డ్ కులాల విభాగం జాతీయ ఛైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్ నేతృత్వంలోని ఈ బృందం.. మాయావతి లక్నోలోనే ఉన్నారని తెలుసుకుని ఆమెను కలవడానికి వెళ్లారు. రాహుల్ గాంధీ పంపిన ప్రత్యేక సందేశంతో వెళ్లిన ఈ ఇద్దరు నేతలు, కాంగ్రెస్-బీఎస్‌పీ మధ్య ఎన్నికల అవగాహనపై ప్రాథమిక చర్చలు ప్రారంభించాలని ఆశించారు. అయితే, మాయావతి వీరిని కలవడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు. కలవడానికి నిరాకరించడంతో, కాంగ్రెస్ నేతలు చేసేదేమీ లేక తమ పేర్లను నివాసం వెలుపల ఉన్న రిజిస్టర్ (గేటు) వద్ద నమోదు చేసి సైలెంట్‌గా వెనుదిరిగారు.

UP Politics Mayawati Refuses to Meet Rahul Gandhi s Envoys Ahead of 2027 Uttar Pradesh Assembly Elections

అఖిలేష్‌తో పొత్తు ఉన్నా.. మాయావతి వైపు?

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతో (ఎస్పీ) పొత్తులో ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమిలో భాగంగా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి కూడా. అయితే, ఎస్పీతో ఉన్న సీట్ల సర్దుబాటు మరియు ఆ పార్టీ ఆధిపత్య ధోరణిపై కాంగ్రెస్‌లోని ఒక పెద్ద వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

బీహార్ ఎన్నికలకు ముందు మాయావతి సంచలన నిర్ణయం
బీహార్ ఎన్నికలకు ముందు మాయావతి సంచలన నిర్ణయం

సీట్ల పంచాయితీ:

ఒక సీనియర్ కాంగ్రెస్ నేత తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలో కాంగ్రెస్ స్వతంత్రంగా బలోపేతం కావడానికి ఎస్పీ తగినన్ని సీట్లు ఇవ్వదు. కాంగ్రెస్ గెలవడం కష్టంగా ఉన్న సీట్లను మాత్రమే ఎస్పీ కేటాయిస్తుంది. 402 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ కనీసం 100 నుండి 125 సీట్లలో పోటీ చేయాలని భావిస్తుంటే.. ఎస్పీ మాత్రం 40 నుండి 50 సీట్ల కంటే ఎక్కువ ఇచ్చేలా కనిపించడం లేదు. అందుకే ఎస్పీ కంటే బీఎస్‌పీతో అవగాహనకు రావడం రాజకీయంగా లాభదాయకమని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.

ఈడీ, సీబీఐ భయమే కారణమా?

బీఎస్‌పీకి కూడా కాంగ్రెస్‌తో పొత్తు అవసరమే అయినప్పటికీ.. మాయావతి ప్రస్తుతం కేంద్ర ఏజెన్సీల ఒత్తిడిలో ఉన్నారని కాంగ్రెస్ నేతలు అజ్ఞాతంగా ఆరోపిస్తున్నారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థల భయం వల్లే ఆమె కాంగ్రెస్‌తో బహిరంగంగా చేతులు కలపడానికి వెనుకాడుతున్నారని వారు భావిస్తున్నారు.

కొత్త కుల సమీకరణాలకు స్కెచ్!

బీజేపీ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న బ్రాహ్మణుల వంటి అగ్రకులాలు, కుర్మీల వంటి వెనుకబడిన వర్గాల ఓటర్లు.. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) పాత ఇమేజ్, వారి కోర్ ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగా ఆ పార్టీకి ఓటు వేయడానికి ఇష్టపడటం లేదని కాంగ్రెస్ విశ్లేషిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్, బీఎస్‌పీ కలిసి వస్తే.. బీజేపీ, ఎస్పీలకు వ్యతిరేకంగా ఒక బలమైన ప్రత్యామ్నాయ వేదిక ఏర్పడుతుందని, తద్వారా ఈ ఓటు బ్యాంక్‌ను తమవైపు తిప్పుకోవచ్చని హస్తం పార్టీ భావిస్తోంది. ఇటీవలి కాలంలో బీఎస్‌పీ ఓటింగ్ శాతం తగ్గినా, దానికి ఉన్న బలమైన దళిత ఓటు బ్యాంకును కాంగ్రెస్ తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది.

Mayawati: మాయావతి సంచలన నిర్ణయం.. మేనల్లుడిని అన్ని పార్టీ పదవుల నుంచి తొలగింపు
Mayawati: మాయావతి సంచలన నిర్ణయం.. మేనల్లుడిని అన్ని పార్టీ పదవుల నుంచి తొలగింపు

మాయావతి మౌనం.. కాంగ్రెస్ బుజ్జగింపులు!

ఇదిలా ఉంటే, ఈ పర్యటనపై పొత్తుల ఊహాగానాలను కాంగ్రెస్ నేత రాజేంద్ర పాల్ గౌతమ్ కొట్టిపారేశారు. "మాయావతి గారు మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ దళిత నాయకురాలు. కేవలం మర్యాదపూర్వకంగా ఆమె యోగక్షేమాలు తెలుసుకోవడానికే వెళ్లాం. మళ్లీ ఆమె పిలిచినప్పుడు కలుస్తాం" అని చెప్పుకొచ్చారు. దళిత ఓట్లను కాంగ్రెస్, ఎస్పీలు కేవలం ఎన్నికల స్వార్థానికే వాడుకుంటాయని గతంలో పలుమార్లు ఆరోపించిన మాయావతి.. ప్రస్తుతానికి ఈ రాయబారంపై పూర్తి మౌనం వహిస్తుండటం యూపీ రాజకీయాల్లో మరింత ఉత్కంఠను రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+