Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

UP polls: లతా మంగేష్కర్ మరణంతో మేనిఫేస్టో విడుదలను వాయిదా వేసిన బీజేపీ

లక్నో: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆదివారం మరణించడంతో భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల త్వరలో జరగనున్న క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార బీజేపీ ఆదివారంనాడు తన మేనిఫెస్టోను ప్రకటించాల్సి ఉంది. ఇందు కోసం బీజేపీ అగ్రనేతలు కూడా లక్నో చేరుకున్నారు.

అయితే, ఇదే సమయంలో భారత గాన కోకిల లతా మంగేష్కర్ మరణంతో ఆమెకు గౌరవ సూచకంగా మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 10న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి విడత ఎన్నికల జరనున్న క్రమంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది బీజేపీ. ఇందులో భాగంగానే ఆదివారం పార్టీ మేనిఫెస్టో విడుదల కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్, కేశవ్ మౌర్య తదితర కీలక నాయకులు లక్నో చేరుకున్నారు.

UP polls: BJP postpones release of manifesto due to Lata Mangeshkars death.

కాగా, ఇదే సమయంలో లతా మంగేష్కర్ మరణం చెందారనే విషయం తెలిసింది. దీంతో బీజేపీ అగ్రనేతలు మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులంతా రెండు నిమిషాలపాటు మౌనం పాటించి లతా మంగేష్కర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.

లతా మంగేష్కర్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రముఖులంతా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. లతా మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఆమెతో గతంలో జరిపిన సంభాషణలు మరువలేనివని గుర్తుచేశారు. ఆమె భౌతిక కాయానికి నివాళి అర్పించేందుకు ప్రధాని మోడీ ఆదివారం మధ్యాహ్నం ముంబై చేరుకోనున్నారు. కాా, లతా మంగేష్కర్ మరణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది.

మేనిఫెస్టో కోసం ప్రజాభిప్రాయాలు కోరిన బీజేపీ

ఇది ఇలావుంగా, బీజేపీ మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి అభిప్రాయాలను, సూచనలను కోరింది. ఇందు కోసం ఓ బాక్సును కూడా ఏర్పాటు చేసింది. ఇందులో ప్రజలు తమ అభిప్రాయాలను, సూచనలను తెలపాల్సిందిగా బీజేపీ కోరింది. బీజేపీ తీర్మాన లేఖ కోసం 15 డిసెంబర్ 2021న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 'ఆకాంక్ష బాక్స్'ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రజల నుంచి సలహాలను కోరారు. 2017లో జారీ చేసిన సంకల్ప్ పత్ర తీర్మానాలన్నింటినీ బీజేపీ నెరవేర్చిందని యూపీ మీడియా ఇంఛార్జ్ పేర్కొన్నారు. బీజేపీ ఇచ్చిన హామీని నెరవేర్చిందన్నారు.

'నిజాయితీగా ఆలోచించండి, సమర్థవంతంగా పని చేయండి, యూపీ తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించండి' అనే థీమ్‌పై ఈసారి బీజేపీ తన ప్రభావవంతమైన పనిని ప్రజల్లోకి తీసుకెళ్లింది. తీర్మానం పత్రంలో బీజేపీ విద్యుత్తు గురించి పెద్ద ప్రకటన చేసింది. 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామన్న ఎస్పీ వాగ్దానానికి తగ్గట్టుగా బీజేపీ కూడా ఓ పెద్ద ప్రకటన చేస్తుందని అంతా ఆశిస్తున్నారు. మేనిఫెస్టో విడుదల తర్వాత బీజేపీ ఈసారి ప్రజలకు ఎలాంటి పెద్ద హామీలు ఇవ్వబోతుందో తేలిపోనుంది. బాకీ ఉన్న విద్యుత్ బిల్లులు కూడా మాఫీ చేస్తున్నట్లు బీజేపీ ప్రకటించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+