UP polls: సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ఎస్పీ అభ్యర్థి ఖరారు, గోరఖ్‌పూర్ నుంచి సభావతి శుక్లా పోటీ

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్న క్రమంలో అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభమయ్యే ఏడు దశల అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సోమవారం 24 మంది అభ్యర్థులతో తాజా జాబితాను విడుదల చేసింది.

గోరఖ్‌పూర్ (అర్బన్) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని పార్టీ అభ్యర్థిగా సభావతి శుక్లా పేరును ప్రకటించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో గోరఖ్‌పూర్ స్థానం నుంచి ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన ఆదిత్యనాథ్, తన ప్రచారంలో అభివృద్ధి, సుపరిపాలన, జాతీయవాదాన్ని ఉటంకిస్తూ మళ్లీ బీజేపీకి భారీగా మద్దతివ్వాలని కోరారు.

UP polls: SPs another list released, names Sabhawati Shukla against CM Adityanath.

ఆదిత్యనాథ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. గోరఖ్‌పూర్ నుంచి ఆయన ఐదుసార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. కాగా, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. ముబారక్‌పూర్‌లోని రెండో స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు గతంలోని కాపీ తప్పుగా ఉంది. పొరపాటుకు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా, అఖిలేష్ యాదవ్.. కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

45 మంది అభ్యర్థులతో మరో జాబితాను విడుదల చేసిన బీజేపీ

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్న క్రమంలో అధికార భారతీయ జనతా పార్టీ మరో 45 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, బీజేపీ, ఎస్పీ పార్టీల మధ్య నేతలు పార్టీలు మారిన క్రమంలో నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు మారారు.

కాగా, బీజేపీ.. అమేథీ నుంచి సంజయ్‌ సిన్హ్‌ను పోటీకి దింపింది. అమేథీ రాజకుటుంబానికి చెందిన సిన్హ్ 2019లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ప్రస్తుతం అమేథీకి సిన్హ్ భార్య గరిమా సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మరోవైపు, ఆర్పీఎన్ సింగ్‌కు బదులుగా మనీష్ జైస్వాల్‌కు పద్రౌనా నుంచి టిక్కెట్ ఇవ్వబడింది, వీరిద్దరూ ఇటీవల కాంగ్రెస్‌ను విడిచిపెట్టి బీజేపీలో చేరారు. పద్రౌనాకు ప్రస్తుతం స్వామి ప్రసాద్ మౌర్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆయన ఇటీవల బీజేపీని వీడి ఎస్పీలో చేరారు.

బల్లియా నగర్ నుంచి దయాశంకర్‌ను పార్టీ పోటీకి దింపింది. అయితే, సింగ్, అతని భార్య స్వాతి సింగ్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సరోజినీ నగర్ నుంచి టికెట్ కోరుకున్నారు. ఈ నియోజకవర్గం టికెట్‌ మాజీ ఈడీ అధికారి రాజేశ్వర్‌ సింగ్‌కు దక్కింది.

మౌ జిల్లాలోని మధుబన్ నియోజకవర్గం నుంచి బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్ కుమారుడు రాంవిలాస్ చౌహాన్‌ను కూడా పార్టీ పోటీకి దింపింది. ఈ స్థానానికి ప్రస్తుతం దారా సింగ్ చౌహాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆయన ఇటీవలే బీజేపీని వీడి ఎస్పీలో చేరారు.

సురేంద్ర సింగ్ వంటి కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పార్టీ వదులుకుంది, బైరియా నుంచి రాష్ట్ర మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లాను పోటీకి దింపింది. కాగా, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన వందనా సింగ్‌కు ఆమె గతంలో పోరాడిన అదే సీటును కేటాయించారు, అంటే అజంగఢ్ జిల్లాలోని సాగి నుంచి పోటీ చేస్తున్నారు.

ఆ పార్టీ మహమ్మదాబాద్ నుంచి అల్కా రాయ్‌ను, ఘాజీపూర్ జిల్లాలోని ఘాజీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రి సంగీత బల్వంత్ బింద్‌ను పోటీకి దింపింది. 403 నియోజకవర్గాలు కలిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మార్చి 10న ప్రకటించబడతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+