యూపీలో బీజేపీకి 185 సీట్లు తథ్యం, న్యూస్ ఎక్స్-ఎమ్మార్సీ అంచనా
దేశమంతా ఆసక్తిగా చూస్తున్న ఉత్తరప్రదేశ్ లో ఈసారి బీజేపీ పాగా వేయనున్నట్లు, బీజేపీ 185 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలవబోతున్నట్లు న్యూస్ ఎక్స్-ఎమ్మార్సీ సర్వే అంచనా.
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఒక్క పంజాబ్ తప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఎగ్జిట్పోల్ ఫలితాలు చూస్తే నోట్ల రద్దు.. బీజేపీపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపనట్లు తెలుస్తున్నది.
దేశమంతా ఆసక్తిగా చూస్తున్న ఉత్తరప్రదేశ్ లో ఈసారి బీజేపీ పాగా వేయనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇక్కడ బీజేపీ 185 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలవబోతున్నట్లు న్యూస్ ఎక్స్-ఎమ్మార్సీ సర్వే అంచనా.

సమాజ్ వాదీ-కాంగ్రెస్ కూటమి 120 సీట్లతో రెండో స్థానంలో నిలుస్తుందని, బీఎస్సీకి 90 సీట్లు, ఇతరులు 8 సీట్లు గెలుచుకుంటాయని ఈ ఎగ్జిట్ పోల్స్ తేల్చింది. యూపీలో మ్యాజిక్ ఫిగర్ 202. బీజేపీకి ఇక్కడ 34 శాతం ఓట్లు రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.












Click it and Unblock the Notifications