రేప్ చేసి కదులుతున్న రైల్లోంచి ఆమెను తోసేశారు
మౌ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్లోని మౌ జిల్లాలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రైలులో ఇంటికి వెళ్తున్న మహిళపై దుండగులు అత్యాచారం చేశారు. దాంతో ఆగకుండా ఆమెను రైలు నుంచి కిందకు తోసేశారు. దాంతో ఆమె కుడికాలును కోల్పోయింది.
బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. జౌన్పూర్ జిల్లాలోని షాగంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ (35) ఇంటికి వెళ్లేందుకు శుక్రవారం రాత్రి మౌ జిల్లాలో తాంసా ప్యాసింజర్ రైలు ఎక్కింది. ఇద్దరు దుండగులు ఆమెపై లైంగికదాడి చేసి కదులుతున్న రైలు నుంచి కిందికి తోసేశారు.

కుర్హత్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాల వెంట నగ్నంగా పడి ఉన్న మహిళను గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తొలుత స్థానిక రైల్వే ఆస్పత్రిలోో చికిత్స అందించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారణాసి ఆస్పత్రికి తరలించారు.
యూపీలో ఈ నెల మొదట్లో కాలేజీ విద్యార్థిని మెడలోని గొలుసును చోరీచేసే క్రమంలో ఓ దొంగ కదిలే రైలు నుంచి తోసివేయడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. రైలు ప్రమాదాల్లో దేశంలో మహారాష్ట్ర తర్వాత యూపీ రెండోస్థానంలో ఉంది. బాధితురాలి ఫొటోగ్రాఫ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications