వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర ప్రమాదం: నదిలో బస్సు పడి 22 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో మంగళవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో ఉత్తర కాశీ నుంచి గంగోత్రి వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ భగీరథి నదిలో పడింది.

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో మంగళవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో ఉత్తర కాశీ నుంచి గంగోత్రి వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ భగీరథి నదిలో పడింది.

ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.

bus accident

సమాచారం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఏడుగురిని కాపాడటంతో వారు గాయాలతో బయటపడ్డారు.

నదిలో నంచి 22 మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా మధ్యప్రదేశ్‌ వాసులుగా గుర్తించారు.

కాగా, ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మృతుల కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేలు ప్రకటించారు.

English summary
A bus carrying 29 people from Uttarkashi to Gangotri falls into river on Tuesday. According to sources, so far 22 bodies have been recovered and 8 other who were injured were admitted to hospital. All were residents of Madhya Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X