ఘోర ప్రమాదం: నదిలో బస్సు పడి 22 మంది మృతి
ఉత్తరాఖండ్లో మంగళవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో ఉత్తర కాశీ నుంచి గంగోత్రి వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ భగీరథి నదిలో పడింది.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో మంగళవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో ఉత్తర కాశీ నుంచి గంగోత్రి వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ భగీరథి నదిలో పడింది.
ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.

సమాచారం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఏడుగురిని కాపాడటంతో వారు గాయాలతో బయటపడ్డారు.
నదిలో నంచి 22 మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు.
కాగా, ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మృతుల కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేలు ప్రకటించారు.












Click it and Unblock the Notifications