శోభాయాత్రకు అనుమతి లేదు, వీహెచ్ పీ మొండిపట్టు, టెన్షన్, అన్నీ బంద్, సీఎం !
హరియాణ/గురుగ్రామ్: మతపరమైన సున్నితమైన జిల్లా అయిన హియాణలోని నుహ్లో హిందూ సంఘాలు సోమవాం రోజు శోభా యాత్రను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాయి. హిందూ సంఘాల ర్యాలీకి పోలీసు అధికారులు అనుమతి నిరాకరించినప్పటికీ తాము యాత్రను కొనసాగిస్తామని హిందూ సంఘాలు ఇప్పటికే తేల్చి చెప్పాయి.
జూలై 31న విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) నిర్వహించిన ఊరేగింపుపై ఓ వర్గం దాడి చెయ్యడంతో హింసకు దారితీసింది. ముస్లింలు మెజారిటీగా ఉన్న నుహ్లో జరిగిన ఘర్షణల్లో ఆరుగురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు హోమ్ గార్డులు, ఓ ముస్లీం మతపెద్ద కూడా ఉన్నారు. ఆ రోజు నుహ్ లో జరిగిన గొడవలు గురుగ్రామ్ కు వ్యాపించడంతో హరియాణలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.

నిరసనలకు ప్రతిస్పందనగా హరియానా ప్రభుత్వం జిల్లాలో 1,900 మంది పోలీసు సిబ్బందిని, 24 కంపెనీల పారామిలటరీ బలగాలను అంతర్ రాష్ట్ర మరియు అంతర్ జిల్లా సరిహద్దుల వెంట మోహరించడం ద్వారా జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేసింది. జి20 షెర్పా గ్రూప్ సమావేశం సెప్టెంబర్ 3 నుంచి 7 వరకు నుహ్లో జరగనుంది.
అందువలన హరియానాలో శాంతిభద్రతలను కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర యంత్రాంగం వీహెచ్ పీ శోభా యాత్రకు అనుమతి నిరాకరించింది. ముందుజాగ్రత్త చర్యగా జిల్లాలో నిషేధాజ్ఞలు అమలు చేశారు. బయటి వ్యక్తులు జిల్లాలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధించబడింది. విద్యా సంస్థలు, బ్యాంకులు మూతపడ్డాయి. మొబైల్ ఇంటర్నెట్ మరియు బల్క్ ఎస్ఎమ్ఎస్ సేవలు నిలిపివేయబడ్డాయి.
జూలై నుండి మరింత మత ఘర్షణలను నివారించడానికి జిల్లాలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమిగూడడం కూడా144 సెక్షన్ అమలు చేశారు. గురుగ్రామ్లోని సోహ్నా టోల్ వద్ద పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పరిపాలన భద్రతా ఏర్పాట్లలో భాగంగా హరియానాలో పోలీసులు టోల్ గుండా వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు.
జూలైలో మతపరమైన అల్లర్ల కారణంగా శోభా యాత్రకు అంతరాయం ఏర్పడిన తర్వాత ఈరోజు మళ్లీ శోభా యాత్రను పునఃప్రారంభించాలని సర్వ రాష్ట్రీయ హిందూ మహాపంచాయత్ ఆగస్టు 13న పిలుపునిచ్చింది. కానీ పోలీసు అధికారులు ఈ శోభా యాత్రకు అనుమతులు ఇవ్వలేదు.

హరియానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రజలు ఊరేగింపులో పాల్గొనకుండా సమీపంలోని దేవాలయాలను సందర్శించి ప్రార్థనలు చేయాలని సూచించారు. దీనికి అధికారులు అనుమతి నిరాకరించారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 28 పవిత్ర శ్రావణ మాసంలో చివరి సోమవారం.
శోభా యాత్రకు బదులుగా ప్రజలు జలాభిషేకం కోసం తమ ప్రాంతాలలోని దేవాలయాలను సందర్శించవచ్చని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మనవి చేశారు. అయితే హిందూ సంఘాలు మాత్రం ఈరోజు శోభా యాత్ర నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. మత ఘర్షణలకు సంబంధించి ఇప్పటివరకు 393 మందిని హరియానా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో 118 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications