ఎందుకో తెలియదు: కత్తులు, రాడ్లతో నైజీరియన్లపై దాడి, యోగి సీరియస్(వీడియో)
నైజీరియన్లపై కొందరు దుండగులు కత్తులు, రాడ్లు, ఇటుకలతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటన నోయిడాలో సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు నైజీరియన్లు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు.
న్యూఢిల్లీ: నైజీరియన్లపై కొందరు దుండగులు కత్తులు, రాడ్లు, ఇటుకలతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటన నోయిడాలో సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు నైజీరియన్లు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. బాధితులు మీడియాతో మాట్లాడుతూ.. తమపై ఎందుకు దాడి చేశారో తెలియడం లేదన్నారు.
ఓ గుంపు వచ్చి కత్తులు, ఇటుకలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచిందని తెలిపారు. సహాయం చేయండని అరిచిన కూడా ఎవరూ పట్టించుకోలేదన్నారు. పోలీసులకు కూడా ఫోన్ చేయలేదని వాపోయారు.
I have asked for a report from Government of Uttar Pradesh about the reported attack on African students in Noida.
— Sushma Swaraj (@SushmaSwaraj) March 27, 2017
చివరకు తమ కళాశాల సిబ్బంది కూడా సహాయం చేయకపోవడంతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు ట్వీట్ చేశామని బాధితులు తెలిపారు. 'గతంలోనూ మా చుట్టు పక్కల ఉండేవారు మీరు మా దేశంలో ఉండొద్దు' అంటుండేవారని, ఇలాంటి వారిని చూసి తాము ఏం మాట్లాడాలని అన్నారు. కాగా, బాధుతుడి ట్వీట్కు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ వెంటనే స్పందించారు.
నైజీరియన్ల ట్వీట్కు స్పందించిన సుష్మా
నోయిడాలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని.. తక్షణమే రక్షణ చర్యలు తీసుకోవాలని సుష్మాను నైజీరియన్లు కోరారు. నైజీరియన్లపై జరిగిన దాడిపై స్పందించిన సుష్మా.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఫోన్ చేసి.. నైజీరియన్లకు రక్షణ కల్పించాలని చెప్పారు. అంతేగాకుండా నిష్పక్షపాతమైన, న్యాయబద్ధమైన విచారణ జరిపించాలని ఆదేశించారు. కాగా, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.
I have spoken to Yogi Adityanath ji Chief Minister of Uttar Pradesh about attack on African students in Greater Noida. /1
— Sushma Swaraj (@SushmaSwaraj) March 28, 2017
ఇది ఇలా ఉండగా, గ్రేటర్ నోయిడాలో మనీశ్ కారి అనే ఇంటర్మీడియట్ విద్యార్థి డ్రగ్స్ అధికంగా తీసుకోవడంతో స్థానికులు ఆగ్రహం చెందారు. నైజీరియన్ల ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతోందని ఫిర్యాదు చేశారు. దీంతో ఆ విద్యార్థి ఉండే అపార్ట్ మెంట్ సమీపంలో ఉన్న ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే నైజీరియన్ పై దాడి జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications