డబ్బుల ఎగవేతపై నాకు ఎలాంటీ ఫీలింగ్స్ లేవు..విజయ్ మాల్యా..
బ్యాంకులకు 9వేల కోట్లు ఎగనామం పెట్టి లండన్లో ఉంటున్న విజయ్ మాల్యా డబ్బుల ఎగవేతపై తనకు ఎలాంటీ ఫీలింగ్స్ లేవని అన్నారు..ఇండియాకు వెళ్లేందుకు మీరు సిద్దంగా ఉన్నారా అంటూ అడిగిన విలేకర్ల ప్రశ్నలకు ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుందంటూ వ్యాఖ్యానించారు. మాల్యను భారత్కు అప్పగింత ఆదేశాలపై అప్పీలు చేసుకునేందుకు భార్య,పిల్లలతో కలిసి హజరయ్యాడు.
ఇండియన్ బ్యాంకులకు 9వేలకోట్లు ఎగనామం పెట్టి లండన్లో ఉంటున్న విజయ్ మాల్యా తనను భారత్ కు అప్పగించాలనే కోర్టు ఆదేశాలపై అప్పిలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు.ఈనేపథ్యంలోనే మీరు చేసిన పనికి పశ్చాత్తాపపడుతున్నారా అనే ప్రశ్నకు ,నాకు ఎలాంటీ ఫీలీంగ్స్ లేవని చెప్పారు. ఈనేపథ్యంలోనే భవిష్యత్ గురించి చెప్పడానికి ఇది క్రికెట్ మ్యాచ్ కాదని కోర్టు అని అన్నారు.
తాను ప్రభుత్వానికి డబ్బులు కావాలంటే ఇండియాలో ఉన్నాయని ,వాటిని అక్కడే తీసుకోవాలని అన్నారు.అయితే ప్రభుత్వం ఎందుకు డబ్బులు తీసుకోవడం లేదో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని అడిగారు.