పాము రక్తం తాగే ప్రత్యర్థితో విజేందర్ సింగ్ ఢీ
మాంచెస్టర్: బాక్సింగ్లో భారతీయ ఆటగాడిని ఎలాగైనా ఓడించాలనే తపనతో హంగేరియన్ బాక్సర్ అష్టకష్టాలు పడుతున్నాడు. భారత బాక్సర్, ఒలింపిక్ విజేత విజయేంద్ర సింగ్ను ఎదుర్కొనేందుకు హంగేరీ బాక్సర్ అలెగ్జాంజర్ హోర్వాత్ తన డైట్లో సంప్రదాయ పద్ధతులను ఫాలో అవుతున్నాడు.
పాము రక్తాన్ని తాగుతున్నానని, దీంతో తన పవర్ పంచ్లతో సరైన గుణపాఠం చెబుతానని అంటున్నాడు. సాధారణంగా ఎవరినైనా బలం కోసం ఏం తాగుతున్నావంటే.. ఆహార పదార్థాలు, పానియాల పేర్లు చెబుతారు.
కానీ హంగేరీ బాక్సర్ అలెగ్జాండర్ హోర్వత్ మాత్రం.. తాను తాజా పాము రక్తం తాగుతున్నానని చెప్పాడు. అతడి పూర్వీకులు కూడా ఇలాగే పాము రక్తం లాగించేవారట.
వందల ఏళ్లుగా మా కుటుంబంలో ఈ సంప్రదాయం ఉందని, పాము రక్తం తాగితే తనకు మాటల్లో వర్ణించలేని శక్తి లభిస్తుందని, నరాల్లో అది ప్రవహిస్తుంటే నన్నెవరూ ఓడించలేరని, పూర్వం యుద్ధాల సమయంలో హంగేరి సైనికులు కూడా పాము రక్తం తాగేవారని, తన రోజువారీ ఆహార జాబితాలో కూడా దాన్ని చేర్చుకున్నానని అతడు చెప్పాడు.
భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తదుపరి బౌట్లో ఇతనితో తలపడబోతున్నాడు. వరుసగా మూడు నాకౌట్లతో ప్రొఫెషనల్ కెరీర్ను ఘనంగా ఆరంభించిన విజేందర్కు.. తనతో బౌట్లో ఎదురుదెబ్బ తప్పదని హోర్వత్ చెబుతున్నాడు. మార్చి 12న బౌట్ జరగనుంది.