viral video: బట్టలూడదీసి బీజేపీ ఎమ్మెల్యేపై రైతుల దాడి -సాగు చట్టాలపై పోరులో అనూహ్య ఘటన -ఖండనలు
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమంలో మరోసారి హింస తలెత్తింది. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ గడిచిన నాలుగు నెలలుగా రైతులు నిరసనలు వ్యక్తం చేస్తుండగా, చివరిసారి జనవరి 26న ఢిల్లీలో హింసాత్మక ఘటనలు జరగ్గా, ఇప్పుడు పంజాబ్ లో ఏకంగా బీజేపీ ఎమ్మెల్యేపైనే రైతులు దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్యే బట్టలూడదీసి తరిమికొడుతూ నానా రభస సృష్టించారు. ఈ ఘటనపై రైతు సంఘాలు సహా సర్వత్రా ఖండనలు వెలువడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

నడిరోడ్డుపై బట్టలు చించి..
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లో తీవ్రంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్ లోని ముక్త్సర్ జిల్లాలోని మాలోట్ లోని అనూహ్య సంఘటన జరిగింది. అబోహర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్ పై భయానక దాడి జరిగింది. శనివారం జిల్లాలో పర్యటించిన ఆయన మలోట్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సాగు చట్టాలకు అనుకూలంగా మాట్లాడబోయిన ఎమ్మెల్యేపై రైతులు దాడికి తెగబడ్డారు. నడిరోడ్డుపైనే ఎమ్మెల్యే బట్టలు చించి చిదకబాదారు. పోలీసులు వారిస్తున్నా రైతులు ఏమాత్రం తగ్గలేదు. ఈ ఘటనకు ముందు, వెనుక గంటలపాటు హైడ్రామా జరిగింది..

బీజేపీ కార్యాలయాన్ని చుట్టుముట్టి..
అబోహర్ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్ శనివారం మాలోట్ లోని బీజేపీ కార్యాలయంలో సాగు చట్టాలకు అనుకూలంగా మాట్లాడుతానంటూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వస్తున్నారన్న సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్న రైతులు.. మాలోట్లోని బీజేపీ కార్యాలయాన్నిముట్టడించారు. వందల సంఖ్యలో రైతులు దూసుకురావడాన్ని గమనించిన పోలీసులు.. ఎమ్మెల్యేను కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు. పార్టీ ఆఫీసులోకి చొరబడ్డ రైతులు ఫర్నీచర్ ధ్వంసం చేసి ఎమ్మెల్యేవైపు దూసుకెళ్లారు. అప్పటికే ఎమ్మెల్యేను ఆఫీసు నుంచి బయటికి తీసుకెళ్లిన పోలీసులు.. దగ్గర్లోని ఓ దుకాణం లోపలికి తీసుకెళ్లారు. వారిని అనుసరించిన రైతులు దుకాణం ముందు బైఠాయించారు..

భయానక దాడి.. వీడియో వైరల్
కాసేపటి తరువాత ఎమ్మెల్యే నారంగ్ దుకాణం నుంచి బయటకు రాగా.. అక్కడున్న రైతులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే దుస్తులు చించేచి, నగ్నంగా పరుగెత్తించిమరీ చితకబాదుడు బాదారు. ఎమ్మెల్యేతోపాటు ఇంకొందరు బీజేపీ నేతలపైనా రైతులు చేయిచేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. సుమారు గంటపాటు అక్కడి వాతావరణం రణరంగాన్ని తలపించింది. బీజేపీ ఎమ్మెల్యేను బట్టలూడదీసి రైతులు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా,

హత్యాయత్నం కేసు.. సీఎం ఆగ్రహం
ముక్త్సర్ జిల్లాలోని మాలోట్ పట్టణంలో అబోహర్ బీజేపీ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్ పై రైతులు దాడి చేయడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు, ఖండనలు వ్యక్తమవుతున్నాయి. గుర్తుతెలియని 300 మంది రైతులపై హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేపై దాడిని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తోపాటు కాంగ్రెస్ పార్టీ సైతం తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులు ఉపేక్షించేది లేదని..ఎమ్మెల్యేపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆయన ఆదేశించారు.
ఎమ్మెల్యేపై దాడికి రైతు సంఘాల ఖండన
కాగా, బీజేపీ ఎమ్మెల్యేపై రైతుల దాడి వ్యవహారం రాజకీయంగా సంచలనం రేపుతున్నది. రైతుల ముసుగులో కాంగ్రెస్ నేతలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పంజాబ్ లో ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ కూడా ఈ ఘటనను ఖండించింది. రైతు ఉద్యమానికి సారధ్యం వహిస్తోన్న 41 రైతు సంఘాల్లో కీలకమైన సంయుక్త్ కిసాన్ మోర్ఛా సైతం బీజేపీ ఎమ్మెల్యేపై దాడిని ఖండించింది. శాంతియుతంగా సాగుతోన్న ఉద్యమంలో హింసకు తావులేదని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications