బిజెపిని అంటావా: నితీష్కు ములాయం మరో షాక్
పాట్నా: నితీష్ కుమార్ - లాలూ ప్రసాద్ యాదవ్ - సోనియా గాంధీకి ఇప్పటికే ఓ షాకిచ్చిన సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సోమవారం నాడు మరో ఝలక్ ఇచ్చారు. ఎన్నికల్లో నితీష్, లాలూ ప్రసాద్లకు తప్ప ఎవరికైనా ఓటు వేయాలని ఆయన బీహార్ ప్రజలకు పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో.. ములాయం తొలిసారి నితీష్, లాలులకు ఝలక్ ఇచ్చారు. బీహార్ ఎన్నికల్లో వారు ఓ కూటమిగా ఏర్పడ్డారు. ఆరు పార్టీలతో కలిసి కూటమి ఏర్పడింది. కానీ, ఎన్నికలకు ముందే.. వారికి ఝలక్ ఇస్తూ వామపక్షాలతో కలిసి తృతీయ ఫ్రంట్గా ములాయం పోటీ చేస్తున్నారు.
అది లాలూ - నితీష్లకు తొలి షాక్ కాగా.. తాజాగా, నితీష్ - లాలూ - కాంగ్రెస్ పార్టీల మహా కూటమికి తప్ప ఏ పార్టీకైనా ఓటేయమని పిలుపునివ్వడం రెండో షాక్.
అంతేకాదు, బీహార్లో బిజెపి ప్రభుత్వం ఏర్పడనుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపికి వాతావరణం అనుకూలంగా ఉందని చెబుతూనే, రాష్ట్రంలో రాజకీయ మార్పు కోరుకుంటున్నామన్నారు. బిజెపి చేసే మంచి పనులను తాను సమర్థిస్తానని చెప్పారు.

లాలూ, నితీష్ ఇద్దరూ కూడా ఫ్రాడ్ల అని ధ్వజమెత్తారు. ఆ ఇద్దరు తనను చీట్ చేశారన్నారు. నితీష్ - లాలూ తన వద్దకు వచ్చి యాంటీ కాంగ్రెస్, యాంటీ బిజెపిగా.. మూడో ఫ్రంట్ను బలోపేతం చేయాలని కోరారని, తాను దానికి అంగీకరించానని, అయితే తనకు చెప్పకుండానే వారు ఆ తర్వాత కాంగ్రెస్తో చేతులు కలిపారన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీతో ప్రజలను ఇబ్బంది పెట్టిన పార్టీ అన్నారు. సోషలిస్టులను జైలుకు పంపించిందన్నారు. బిజెపిని విమర్శించే నైతిక హక్కు నితీష్ కుమార్కు లేదన్నారు. ఆయన పన్నెండేళ్ల పాటు బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేలో ఉన్నారన్నారు. హఠాత్తుగా బీజేపీని తూలనాడటం ఏమిటన్నారు.
బీహార్లో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం లేదని, అందుకే తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని, అప్పుడు తామీ ప్రభుత్వం ఎన్నికకు కీలకం అవుతామని బీహార్ ప్రజలకు సూచించారు. బీహార్ అభివృద్ధిని కాంక్షించే పార్టీకి మేం మద్దతిస్తామని... పరోక్షంగా బిజెపిని ఉద్దేశించి అన్నారు.
మహా కూటమికి నేతృత్వం వహించాలని ములాయంను కోరినా ఆ తర్వాత లాలూ, నితీష్లు సోనియాకు వారు ప్రాధాన్యత ఇవ్వడం ములాయంకు రుచించలేదు. దానికి సీట్ల పంపకాలు కూడా తోడయ్యాయి. దీంతో ములాయం మహాకూటమికి దూరమయ్యారు. కేంద్రంలో కీలక బిల్లుల ఆమోదానికి ఎస్పీ ఎంపీలు కీలకం యూపీలో అభివృద్ధికి కేంద్రం మద్దతు తప్పనిసరి. దీంతో, బిజెపి - ఎస్పీ సన్నిహితమయ్యాయని అంటున్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications