Viral video:వావ్.. శునకాన్ని కాపాడిన వ్యక్తి.. పట్టాలపై ఉండగా సేవ్ చేసి.. వైరల్
రైలు వస్తుందంటే చాలు.. అంతే కొందరు భయపడతారు. స్టేషన్/ ఇతర చోట అటు వైపు వెళ్లేందుకు ట్రై కూడా చేయరు. అయితే మూ జీవాలకు తెలియదు కదా.. అందుకే అవీ ఆ వైపు వస్తుంటాయి. ఇటీవల ఓ శునకం కూడా పట్టాల వద్దకు వచ్చింది. ఇంకేముంది.. ఒకతను చూశాడు. దానిని అలా చూసి వదిలివేయాలని అనిపించలేదు. ఏం జరిగినా సరే.. కాపాడాలని అనుకున్నాడు. రంగంలోకి దిగి సేవ్ చేశాడు. అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు.

పట్టాలపై కుక్క పిల్ల
రైలు వస్తోన్న సరే.. ఓ కుక్కపిల్ల పట్టాలపై ఉంది. దానిని రైలు డ్రైవర్ గమనించాడు. రైలును కాస్త స్లో చేశాడు. ఇంతలో ఒకతను చూశాడు. కాపాడాలని అనుకున్నాడు. రైలు వేగం తగ్గడం వరంగా భావించాడు. ఇంకేముంది వెంటనే పట్టాలపైకి వచ్చాడు. దానిని తీసుకుని పట్టాలు దాటాడు. వెంటనే దానిని ప్లాట్ ఫారమ్ పైకి తీసుకెళ్లాడు. అతనికి కూడా ఇతరులు చేయి ఇవ్వగా.. పైకి వచ్చాడు. అయితే సాహసం చేసిన యువకుడు కానీ.. శునకానికి కానీ ఎలాంటి గాయం కాలేదు.
ఇన్ స్టలో షేర్
వీడియోను ముంబై మేరీ జాన్ పేరుతో గల పేజీలో ఇన్ స్టాలో షేర్ చేశారు. దీనిని నిఖిల లొఖాండే చేశారు. వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే 2 లక్షల సార్లు చూశారు. 15 వేల లైకులు కొట్టారు. చాలా మంది కామెంట్స్ చేశారు. శునకాన్ని కాపాడిన వ్యక్తిని చాలా మంది కొనియాడారు. అతను అలా ధైర్యవంతుడు అన్నారు. భగవంతుడి దయతో లోకో పైలట్, యువకుడు.. శునకాన్ని కాపాడారని తెలిపారు.
Recommended Video

సూపర్..
ఇదిలా ఉంటే ఇదివరకు లాస్ ఏంజెల్స్లో ఒకతను శునకానికి సీపీఆర్ చేశాడు. దానిని ప్రాణాలను కాపాడారు. అతనిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. సాటి జీవిపై ఆయన చూపిన కరుణ బాగుందని, ఇతరులకు మార్గదర్శకంగా నిలిచారని అంటున్నారు.












Click it and Unblock the Notifications