VIRAL VIDEO:వందే భారత్ ట్రైన్లో వందేమాతరం, అదీ కూడా ఫ్లూట్తో, వైరల్
ఇటీవల వందేభారత్ ఎక్స్ప్రెస్ వరసగా వార్తల్లోకి వస్తోన్న సంగతి తెలిసిందే. అదీ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అదీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయినందున అలా అవుతుండవచ్చు. అయితే విషయానికి వస్తే ఒకతను వందేభారత్ ట్రైన్లో ఫ్లూట్తో వందేమాతరం పాడాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది.
ప్రధాని మోడీ చెన్నై- మైసూర్ మీదుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ను బెంగళూరులో గల క్రాంతివీర సంగొలి రాయన్న రైల్వేష్టేషన్ వద్ద ప్రధాని మోడీ ప్రారంభించారు. అలా ప్రారంభించారో లేదో.. ఒక విద్యార్థి ప్లూట్తో వందేమాతరం పాడాడు. వీడియోను రైల్వే అధికారి అనంత్ రుపనగుడి ట్వీట్ చేశారు. అదీ కాస్త వైరల్ అవుతుంది.
బెంగళూరుకు చెందిన శేషాద్రి ప్లూట్ వాయించారు. అందులో ఉన్న మిగతావారు అతనిని ఎంకరేజ్ చేశారు. అందులోక కొందరు కూర్చొగా.. మరికొందరు నిల్చొని ఉన్నారు. ఆ వీడియోను అతని కో ప్యాసెంజర్ షూట్ చేశాడు. 47 సెకన్ల నిడివి గల వీడియో వైరల్ అవుతుంది. వీడియో ఇప్పటికే 5800 వ్యూస్ వచ్చాయి. 400 లైకులు వచ్చాయి. చాలా మంది వండర్ ఫుల్ అంటూ కామెంట్ చేశారు. నైస్ అంటూ అందరూ కామెంట్ చేశారు.
Aprameya Seshadri, a 12th student from Bengaluru, playing the wonderful Vande Mataram tune on the flute! #IndianRailways #VandeBharatTrain #VandeBharat pic.twitter.com/q89cwfccIa
— Ananth Rupanagudi (@Ananth_IRAS) November 11, 2022
నిజానికి వీడియో చాలా బాగుంది. అతను వందేమాతరం అంటూ ప్లూట్ చక్కగా వాయించారు. అందరూ.. వావ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.