శశికళ వల్లే జయకు దూరమయ్యాం. ప్రధానికి ఫిర్యాదు చేస్తాం
శశికళ కారణంగానే తమ కుటుంబం జయకు దూరమైందని జయ సోదరి శైలజ కూతురు అమృత ఆరోపించారు. జయ ఎప్పుడు చనిపోయారో తిథి కూడ తెలియని పరిస్థితి ఉందన్నారు.
బెంగుళూరు :శశికళ కారణంగానే తమ కటుంబం జయలిలితకు దూరమైందని జయలలిత సోదరి కుమార్తై అమృత చెప్పారు. జయలలిత మరణంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలుస్తామని ఆమెచెప్పారు.శశికళ ఏర్పాటుచేసిన పంజరంలో జయలలిత చిలుకలా ఇరుక్కొని మథనపడ్డారని ఆమె అభిప్రాయపడ్డారు.
పంజరంలో చిలుకలా జయ
తమ పెద్దమ్మ శశికళ ఏర్పాటు చేసిన పంజరంలో చిలుకలా మథపడ్డారని ఆమె అభిప్రాయపడ్డారు. పేదలకు సంక్షేమ పథకాలను అందించడంలోనూ, అభిమానం చూపడంలో ఆమె మహారాణిగా ఉండేవారని ఆమృత గుర్తుచేసుకొన్నారు. జయలలిత ఏ క్షణంలో చనిపోయారనేది అంతుచిక్కని మిస్టరీగా ఉందని ఆమె చెప్పారు.ఏ తిథిలో ఆమె చనిపోయారో కూడ తమకు తెలియదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

19698 కాలంలో తాము పోయెన్ గార్డెన్ లో పెద్దమ్మతో పాటు ఉన్నానని ఆమె గుర్తు చేసుకొన్నారు. అయితే ఈ విషయమై తమిళ పత్రికల్లో కథనాలు రావడంతో అక్కడి నుండి బెంగుళూరుకు వచ్చానని ఆమె చెప్పారు.2014 వరకు పెద్దమ్మను ఆమె నివాసంలో కలుసుకొనే అవకాశం ఉందన్నారు.
ఆ ఇంటికి వెళ్ళకుండా ఫోన్ లో మాత్రమే తరచూ జయతో మాట్లాడేవారమని అమృత గుర్తుచేసుకొన్నారు. మా అమ్మతో జయ తరచూ ఫోన్ లో మాట్లాడేవారని ఆమె గుర్తు చేశారు. రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానని ఆమె తరచూ తన తల్లితో చెప్పేవారన్నారు. శశికళ కారణంగానే తమ కుటుంబం జయకు దూరంగా ఉంటుందని ఆమె చెప్పారు. జయ అంత్యక్రియలు జరిగే ప్రాంతానికి కూడ వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. తన తల్లి గత ఏడాది ఏప్రిల్ 9వ, తేదిన అనారోగ్యంతో చనిపోయారని ఆ సమయంలో పెద్దమ్మను కలిసేందుకు పోయెన్ గార్డెన్ కు వెళ్తే శశికళ మనుషులు తనను అనుమతించలేదని అమృత చెప్పారు.












Click it and Unblock the Notifications