'చంద్రబాబు తమిళనాడుకు ఎప్పుడొచ్చిన కచ్చితంగా దాడి చేస్తాం'
చెన్నై: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తమిళ్ మక్కాల్ విదుతలై పులికల్ (టీఎంవీపీ) ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది. చంద్రబాబు తమిళనాడుకు వస్తే కచ్చితంగా అతని పైన దాడి చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు తమిళనాడుకు ఎప్పుడు వచ్చినా తాము దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని శుక్రవారం నాడు టీఎంవీపీ పార్టీ కార్యకర్త వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా, తాము తెలుగు వారి పైన, వారి సంస్థల పైన కూడా దాడికి వెనుకాడబోమని చెప్పాడు.

శేషాచలం ఎన్కౌంటర్కు నిరసనగా టీఎంవీపీ శుక్రవారం నాడు భారీ రాస్తా రోకో చేపట్టింది. ఈ సందర్భంగా ఓ కార్యకర్త పై వ్యాఖ్యలు చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వారు నినాదాలు చేశారు.
శేషాచలం ఎన్కౌంటర్ పక్కా ప్రణాళికతో జరిగిందని ఆరోపించారు. ఘటనకు కారణమైన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్కు నిరసనగా తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. వైకో చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే, అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్












Click it and Unblock the Notifications