అయోధ్యలో కనీవినీ ఎరుగనిరీతిలో రామాలయం, దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు: రాజ్నాథ్ సింగ్
జాతీయ పౌరసత్వ రిజిష్టర్ (ఎన్ఆర్సీ) దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. ఇటీవల బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా.. ప్రభుత్వ విధానమేమి మారలేదు. జార్ఖండ్లో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. ఎన్ఆర్సీపై మోడీ సర్కార్ వైఖరిని మరోసారి తెలియజేశారు.

ఎన్ఆర్సీ అమలు..
అసోంలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేస్తామని తెలిపారు. ఆదివారం జార్ఖండ్లో రాజ్నాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాతీయ పౌరసత్వ రిజిష్టర్ దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ఉద్గాటించారు. అంతేకాదు తమ దేశంలో వలసదారులు ఉండాలని కోరుకోరని స్పష్టంచేశారు. కానీ కొన్ని పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం దీనిపై రచ్చ చేస్తున్నాయని విమర్శించారు.

ఎందుకిలా..?
జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజ్నాథ్ కామెంట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వ్యాఖ్యలతో ఓటు బ్యాంకు పెరుగుతుందా అనే వాదన కూడా ప్రారంభమైంది. కానీ మెజార్టీ వర్గం మాత్రం వ్యతిరేకంగా ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. జార్ఖండ్లో తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని రాజ్నాథ్ ధీమా వ్యక్తం చేశారు.

ఫుల్ మెజార్టీ
బొటా బోటి కాకుండా.. పూర్తి మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరుతుందని చెప్పారు. బీజేపీ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులను విమర్శించే స్థాయి ఏ నేతకు లేదని గుర్తుచేశారు. వారే అవినీతిపరులని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కనీవినీ ఎరుగనిరీతిలో
అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని రాజ్నాథ్ స్పష్టంచేశారు. రాముడి జన్మస్థానంలో ఆలయం నిర్మిస్తామని పేర్కొన్నారు. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హమీ మేరకు ఆలయ నిర్మాణం ఉంటుందని తెలిపారు. కానీ కొన్ని పార్టీలు కూడా తమ మేనిఫెస్టోను విమర్శించాయని గుర్తుచేశారు. ఇప్పుడు చూడండి ఆ హామీ నెరవెరబోతుందని చెప్పారు.ప్రపంచంలోనే ప్రఖ్యాత ఆలయంగా రూపుదిద్దుకోబోతుందని చెప్పారు. నాలుగేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications