శోభనం రోజు ఆ పనేంటని అడిగినందుకే.. : వింటే నోరెళ్ల బెట్టాల్సిందే..!
దూరాలను దగ్గర చేసుకోవడం.. దగ్గరివారిని దూరం చేసుకోవడం పెరుగుతున్న సాంకేతికాభివృద్దితో ఆధునిక మానవుడు కనెక్ట్ అవుతున్న తీరు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం మనుషులను ఓ ఊపు ఊపేస్తున్న ఈరోజుల్లో చాలామందికి ఫేస్ బుక్ లోనో, వాట్సాప్ ఛాటింగుల్లోను తెల్లారడం పరిపాటిగా మారిపోయింది. అయితే.. విపరీతం వినాశనానికే అన్నట్టు, దేనికైనా ఓ హద్దు దాటుంది కదా.. ఆ హద్దుల్ని కూడా లెక్క చేయకుండా గుడ్డిగా ముందుకెళ్తే జీవితం బుగ్గి పాలే.
తాజాగా.. ఇదే తరహాలో చోటు చేసుకున్న ఓ ఘటన హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తగా పెళ్లైన ఓ జంట కాపురంలో సోషల్ మీడియా చిచ్చు పెట్టింది. అదీ.. వివాహాం జరిగిన కొన్ని గంటల్లోపే కావడం విస్మయానికి గురి చేస్తోంది. వివాహా తంతు ముగిసింది, పెద్దలు శోభనానికి ఏర్పాట్లు చేశారు.
ఏవేవో ఊహలతో శోభనం గదిలో అడుగుపెట్టిన నవ వరుడు.. కొత్త పెళ్లి కూతురు ప్రవర్తన చూసి ఖంగు తిన్నాడు. తాను గదిలోకి వచ్చిన, తన పనేదో తనదే అన్నట్టుగా మొబైల్ ఛాటింగులో బిజీ బిజీగా గడుపుతున్న ఆమెను చూసి ఆ నవ వరుడికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో నేను ముఖ్యమా.. ఛాటింగ్ చేసే వ్యక్తి ముఖ్యమా.. అని నిలదీశాడు. అయితే ఆ నవ వధువు కూడా నాకు నా ఫ్రెండ్సే ముఖ్యమని తేల్చేయడంతో.. విషయం కాస్త విడాకులకు దారి తీసింది.
అంతేకాదు.. పరస్పర అంగీకారంతో విడాకులు కూడా తీసుకున్నారు. విషయం విన్న జనం మాత్రం ఈ మాత్రం దానికి పెళ్లి చేసుకోవడమెందుకు అని ముక్కున వేలేసుకుంటున్నారు.