బాలికపై లైంగిక దాడి: బొటిక్ యజమాని బుక్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో చిన్నారులపై లైంగిక దాడులు ఎక్కువ అవుతున్నాయి. తల్లితో కలిసి వెళ్లిన బాలిక లైంగిక దాడికి గురి కావడంతో పోలీసులు కామాంధుడిపై కేసు నమోదు చేశారు.
పోలీసు కథనం మేరకు ఆదివారం మూడవ తరగతి చదువుతున్న బాలిక తల్లితో కలిసి హోరమావు సమీపంలోని వెల్-నౌ బొటిక్ కు వెళ్లింది. తరువాత తల్లి ట్రయల్ రూంలోకి వెళ్లింది. ఆ సందర్బంలో బొటిక్ యజమాని సల్మాన్ (36) బాలికపై అఘాయిత్యం చెయ్యబోయాడు.
అయితే అక్కడ బాలిక ఆ విషయం తల్లికి చెప్పలేదు. ఇంటికి వెళ్లిన తరువాత బాలిక అసలు విషయం తల్లికి చెప్పింది. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన పోలీసులు సల్మాన్ మీద పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.
బాలికను ఆసుపత్రికి తరలించి వైద్య పరిక్షలు నిర్వహించామని పోలీసులు అన్నారు. విషయం తెలుసుకున్న బొటిక్ యజమాని సల్మాన్ పరారైనాడని అతని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.