మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తలకి తీవ్ర గాయమైంది. ఆమె నుదుటి గాయానికి సంబంధించిన ఫొటోలను టీఎంసీ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. దీదీ కోలుకోవాలంటూ ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది. అయితే కాళీఘాట్లోని తన నివాసంలోనే మమత గాయపడినట్లు సమాచారం.
తన గదిలో నుంచి బయటకు వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు మమతా బెనర్జీ కిందపడి గాయపడ్డట్లు తెలిసింది. అయితే వెంటనే మమతను చికిత్స కోసం కోల్కతాలోని ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో ఆస్పత్రిలోని వుడ్బర్న్ బ్లాక్ నుంచి ట్రామా కేర్ సెంటర్కు తరలించారు. ప్రస్తుతం దీదీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

Our chairperson @MamataOfficial sustained a major injury.
— All India Trinamool Congress (@AITCofficial) March 14, 2024
Please keep her in your prayers 🙏🏻 pic.twitter.com/gqLqWm1HwE
ముఖ్యమంత్రి మమత బెనర్జీ వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ట్వీట్ చేశారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. కోల్కతా నగర మేయర్ ఫిరాద్ హకీం తోపాటు ఇతర పార్టీ నేతలు ఆస్పత్రికి వెళ్లి మమతను పరామర్శించారు. మమత పార్టీ నేతలు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.
కాగా, ఈ ఏడాది జనవరిలోనూ ఓ కారు ప్రమాదంలో మమతా తలకు స్వల్ప గాయమైంది. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం బర్ధమాన్ నుంచి కోల్కతాకు తిరిగి వస్తుండగా ఆమె కాన్వాయ్కు ఎదురుగా ఉన్నట్టుండి మరో వాహనం రావడం వల్ల దాన్ని తప్పించేందుకు డ్రైవర్ కారుకు బ్రేక్ వేశాడు. దీంతో ముందు సీట్లో కూర్చున్న సీఎం విండ్షీల్డ్కు ఢీకొనడం వల్ల తలకు స్వల్ప గాయమైనట్టు అధికారులు తెలిపారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications