బెంగాల్ ఆరోదశ పోలింగ్- 11 గంటలకు 37 శాతం- ఓటర్లకు ప్రధాని మోడీ, షా విజ్ఞప్తి
పశ్చిమబెంగాల్లో ఆరో దశ పోలింగ్ చురుగ్గా సాగుతోంది. ఉదయం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు పలు నియోజకవర్గాల్లో ఓటర్లు బారులు తీరారు. 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు భారీగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
పశ్చిమబెంగాల్లో ఆరో దశ అసెంబ్లీ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మూడుదశల పోలింగ్ను ఒకటి లేదా రెండు దశలకు కుదించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేసినా ఈసీ పట్టించుకోలేదు. ఇప్పటికే మూడు దశల పోలింగ్కు ఏర్పాట్లు చేసినట్లు చెప్పేసింది. దీంతో ఇవాళ ఆరో దశ ఎన్నికలు నిరాటంకంగా సాగిపోతున్నాయి. ఆరోదశలో భాగంగా 43 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల్లో 306 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు.

ఇవాళ ఎన్నికలు జరుగుతున్న ఉత్తర దినాజ్పూర్లో 11 గంటల కల్లా 40 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే నాదియాలో 38 శాతం, నార్త్ 24 పరగణాల్లో 32 శాతం, పూర్వ బర్దమాన్లో 41 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో సగటున ఈ దశలో 70 శాతం వరకూ పోలింగ్ జరగొచ్చని అంచనా వేస్తున్నారు. కీలకమైన నార్త్ 24 పరగణాల జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎన్నికలు బీజేపీతో పాటు తృణమూల్ కాంగ్రెస్కూ కీలకంగా మారడంతో ఈ ఫలితాలపైనా ఉత్కంఠ నెలకొంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications