ఇకపై బార్లలో మహిళలు పనిచేయొచ్చు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇకపై బార్లలో మహిళలు పనిచేయొచ్చని రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బార్లలో మహిళలు పనిచేసేందుకు అనుమతించే బిల్లుకు బెంగాల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బెంగాల్ ఎక్సైజ్ యాక్ట్- 1909ను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. మహిళల ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు ఈ చట్టం ఆటంకంగా మారిందని బెంగాల్ మంత్రి చంద్రిమ భట్టాచార్య అభిప్రాయ పడ్డారు. ఈ చట్టం వివక్షతతో కూడుకున్నదని.. అందుకే చట్ట సవరణ చేసినట్టు పేర్కొన్నారు. ఉపాధి అవకాశాల్లో ఆడ, మగ అని విబేధాలు తమ ప్రభుత్వానికి లేవని అన్నారు.

ఇక ఈ బిల్లు తక్షణమే బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్నట్లు భట్టాచార్య తెలిపారు. సవరించిన బిల్లు ప్రకారం.. నాటు సారా తయారీని నిరోధించేందుకు బెల్లంతో సహా ఇతర ముడి పదార్ధాలపై పర్యవేక్షణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందన్నారు.
ఈ బిల్లుతోపాటు వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టం- 1944ను కూడా సవరించనుంది మమతా బెనర్జీ ప్రభుత్వం. కొవిడ్-19 తర్వాత నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తేయాకు పరిశ్రమ, తేయాకు తోటలకు పన్ను నుంచి ఉపశమనం కల్పించేందుకు ఈ చట్టాన్ని సవరించారు.
-
టెన్త్ పాస్ అయితే చాలు నెలకు రూ.1500-ఖాతాల్లో జమ ప్రారంభం..! -
వాళ్లు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్టు - పవన్ కీలక వ్యాఖ్యలు..!! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
Botsa Satyanarayana: బొత్సకు మళ్లీ అస్వస్ధత-మండలిలో మాట్లాడుతూనే..! -
చంద్రబాబు ముగ్గురు బిడ్డల పథకంపై మాజీ ఫ్రెండ్ పంచ్ లు..! -
మాటలతో, మూటలతో ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదు - సీఎం రేవంత్ రెడ్డి -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు












Click it and Unblock the Notifications