పీఎంసీ సంక్షోభంపై ఏ నిర్ణయం తీసుకున్నారు.. బీజేపీ డైరెక్టర్లపై చర్యలు తీసుకోరా.. కపిల్ సిబాల్
దేశవ్యాప్తంగా ఒక కుదుపు కుదిపేస్తోన్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు స్కాంపై కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ బ్యాంకు 12 మంది డైరెక్టర్లు బీజేపీకి చెందినవారేనని విమర్శించారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కుంభకోణాలమయంగా మారిందని విమర్శించారు.
పీఎంసీ బ్యాంకులో రూ.4 వేల కోట్లకు పైగా స్కాం బయటపడిన సంగతి తెలిసిందే. దీంతో ఖాతాదారుల నగదు విత్ డ్రా పరిమితి విధించారు. తొలుత రూ. వెయ్యి. తర్వాత పదివేలకు పెంచిన సంగతి తెలిసిందే. ఇటీవలే నలుగురు రోగుల బంధువులు డబ్బు విత్ డ్రా చేసుకోలేక ఆస్పత్రిలో చనిపోవడం కలవరానికి గురిచేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ కామెంట్స్ కలకలం రేపింది.

పీఎంసీ బ్యాంకు సంక్షోభ నివారణకు కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఎందుకు జోక్యం చేసుకుంటలేరని మండిపడ్డారు. పీఎంసీకి 12 మంది బీజేపీ డైరెక్టర్లు ఉన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. అందుకోసమే వారిని సీబీఐ అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు గురించి ఆలోచించడం మాని.. పీఎంసీ సంక్షోభం నుంచి ప్రజలను ఎలా కాపాడటంపై శ్రద్ధ తీసుకోవాలని కోరారు. తమ ప్రభుత్వంలో కుంభకోణాలే జరగలేదని చెప్తున్న మోడీ .. ఆర్టికల్ 370 గురించి ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వడం మానివేయాలని సూచించారు. పీఎంసీ స్కాం తర్వాత ఆర్బీఐ విధించిన ఆంక్షలతో పౌరులు ఇబ్బందికి గురవుతున్నారని పేర్కొన్నారు.
పీఎంసీ బ్యాంకులో రూ.4 వేల కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఖాతాదారుల విత్ డ్రాపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఆర్నెల్లకు రూ.40 వేలు విత్ డ్రా చేసుకోవాలని సూచించడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. అనారోగ్యంతో నలుగురు ఖాతాదారులు చనిపోయిన సంగతి కూడా తెలిసిందే.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications