ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు 'పుష్ప' సినిమా డైలాగ్‌కు సంబంధమేంటి? సోషల్ మీడియాలో దీనిపై ఏం చర్చ జరుగుతోంది?

ఉత్తర‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
Click here to see the BBC interactive

ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి బీజేపీ 244 సీట్లలో ఆధిక్యంలో ఉంది. సమాజ్‌వాదీ పార్టీ 123 స్థానాల్లో, కాంగ్రెస్ రెండుచోట్లా, బీఎస్పీ ఒకచోట ఆధిక్యంలో ఉన్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 201 సీట్లు కావాలి.

ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను బీజేపీ అందుకున్నట్లే.

ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను బీజేపీ అందుకుంది.

ఈ అంశం అప్పుడే సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. బీజేపీ ఫలితాలపై ట్విటర్‌లో చాలా రకాలుగా స్పందిస్తున్నారు. మీమ్స్‌తో యూజర్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

మధుకర్ మధు అనే యూజర్ యూపీ ఎన్నికలను యుక్రెయిన్ సంక్షోభంతో అనుసంధానిస్తూ ట్వీట్ చేశారు.

''రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కాల్పుల విరమణ ప్రకటించారు. ఆయన కూడా యూపీ ఎన్నికల ఫలితాలను చూస్తున్నారు'' అని వ్యాఖ్యను జోడించారు.

https://twitter.com/putinkumar13/status/1501780396731625472

''ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలో విన్ డీజిల్ రేసును గెలిచినట్లుగా, యోగి కూడా యూపీ ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు'' అని దీపక్ జైన్ అనే యూజర్ ట్వీట్ చేశారు.

https://twitter.com/Dipsdj007/status/1501775338548129793

హిందూ కేసరి అనే ట్విటర్ హ్యాండిల్ యోగి ఆదిత్యనాథ్‌ను ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయంగా అభివర్ణించింది.

''ఎట్టకేలకు మనకు మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడు లభించారు. మిగతా పార్టీల వద్ద ఇలాంటి నాయకుడు లేరు. ప్రత్యర్థి పార్టీల దుమ్ము దులిపిన యోగి ఆదిత్యనాథ్‌కు అభినందనలు. త్వరలోనే ఆయన జాతీయ నాయకుడిగా మారతారని ఆశిస్తున్నా'' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

https://twitter.com/HinduKesari/status/1501780360668979202

మరికొంతమంది కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యంగా ట్వీట్లు చేశారు.

దేశీ చోరా అనే ట్విటర్ అకౌంట్‌... రిజల్ట్స్ రోజున కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని చివరి వరుస నుంచి వెతుక్కుంటున్నట్లుగా సూచించే మీమ్‌ను పోస్ట్ చేసింది.

https://twitter.com/Deshi_Indian01/status/1501779548827906049

కొంతమంది 'పుష్ప' సినిమాలోని డైలాగ్‌ను బీజేపీకి, యోగి ఆదిత్యనాథ్‌కు ఆపాదిస్తూ ''కమలం అంటే ఫ్లవర్ అనుకున్నారా...ఫైర్'' అని ఛలోక్తులు పేలుస్తున్నారు.

https://twitter.com/Akdas_Hayat/status/1501787278808854529

ఆదర్శ్ పాండే అనే యూజర్ సమాజ్‌వాదీ పార్టీని లక్ష్యంగా చేసుకుంటూ ట్వీట్ చేశారు. 'బీజేపీ గెలుస్తుంటే ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయి' అనే వ్యాఖ్యను జోడించారు. అంతేకాకుండా ఓడిపోయిన సమాజ్‌వాదీ పార్టీ, ఈవీఎంల హ్యాకింగ్‌ను చూపిస్తూ ఓటమి భారాన్ని దించుకుంటున్నట్లుగా ఒక మీమ్‌ను ట్వీట్ చేశారు.

https://twitter.com/Adarsh2716/status/1501733749289271296

ట్రెండ్స్‌లో బీజేపీ మెజార్టీ మార్క్‌ను దాటినట్లు చూపుతున్నప్పటికీ, బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు వెనకంజలో ఉన్నారు.

ట్రెండ్స్ మొదలవ్వకముందు ఉత్తర్‌ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ''ప్రజలు గెలుస్తున్నారు, గుండాగిరి ఓడిపోతోంది'' అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు పలువురు యూజర్లు స్పందిస్తున్నారు.

https://twitter.com/UPENDRA94151554/status/1501791131348045826

https://twitter.com/shamsheerpanwar/status/1501776170949378048

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా గురువారం ఉదయం ట్వీట్ చేశారు.

''ఇంకా ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఇది ధైర్యంగా ఉండాల్సిన సమయం. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎస్పీకి మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు'' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+