Citizenship Bill: ‘బిల్లుపై ఎందుకంత తొందర? దేశ విభజనపై కాంగ్రెస్ను అంటారా?’
Recommended Video
న్యూఢిల్లీ: భారతీయ విలువలకు పౌరసత్వ బిల్లు విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌరసత్వ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టిన అనంతరం ఆనంద్ శర్మ మాట్లాడారు. ఈ బిల్లు వివక్షతో కూడుకున్నదని అన్నారు.
దేశ విభజనకు కాంగ్రెస్ కారణమంటూ ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని ఆనంద్ శర్మ కేంద్రంపై మండిపడ్డారు. దేశ విభజనకు కాంగ్రెస్ ఎప్పుడూ మద్దతు పలకలేదన్నారు. అమిత్ షా రాజకీయాలు పార్లమెంటు బయటే చేయాలన్నారు. రెండు దేశాల సిద్ధాంతం అనేది వీర్ సావర్కర్ ఆలోచనేనని శర్మ అన్నారు.

ముస్లీం లీగ్ను బ్రిటీష్ వారే ప్రోత్సహించారని, కాంగ్రెస్ పార్టీపై నిషేధం విధించిందన్నారు. రెండు దేశాలు ఏర్పడటానికి ముస్లింలీగ్, హిందూ మహాసభలే కారణమని ఆనంద్ శర్మ ఆరోపించారు. బ్రిటీష్ వారి జోక్యాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని ఆయన అమిత్ షాను ప్రశ్నించారు. జిన్నా కూడా రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ పౌరసత్వ బిల్లులతో రాజ్యాంగ నిర్మాతలను అవమానిస్తున్నారని ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. ఇంత అత్యవసరంగా ఈ బిల్లును ఎందుకు ప్రవేశపెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటు ప్యానెల్ పరిశీలనకు పంపాలని ఆయన అన్నారు. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ బిల్లుతో భారత ఆత్మ క్షోభిస్తోందని, విలువల పరీక్షలో
Anand Sharma,Congress in Rajya Sabha: In our religion, we believe in rebirth,and that we meet our elders. So if Sardar Patel meets Modi ji then he will be very angry with him, Gandhi ji will ofcourse be sad, but Patel will be indeed very angry. #CitizenshipAmendmentBill pic.twitter.com/cTcnyynaet
— ANI (@ANI) December 11, 2019
కేంద్రమంత్రి జితేందర్ సింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధికి నోచుకోలేదని, గత ఐదేళ్ల నుంచే అక్కడ అభివృద్ధి జరుగుతోందని అన్నారు. గత 65ఏళ్ల జరగని అభివృద్ధి ఈ ఐదేళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిందని ఆయన తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications