వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకసభలో మోడీకి 'జై శ్రీరాం'తో స్వాగతం, బిజూ జనతాదళ్ ఎంపీ కూడా..

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మలి విడత జరుగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం సభ సమావేశం అయినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ సభలోకి అడుగు పెడుతుండగా ఒక్కసారిగా బీజేపీ సభ్యులు జై శ్రీరాం, మోడీ..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మలి విడత జరుగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం సభ సమావేశం అయినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ సభలోకి అడుగు పెడుతుండగా ఒక్కసారిగా బీజేపీ సభ్యులు జై శ్రీరాం, మోడీ.. మోడీ అంటూ స్వాగతం పలికారు.

సాధారణంగా ప్రధాని, ఇతర సీనియర్ నాయకులు ఎవరైనా సభలోకి వస్తున్నప్పుడు గౌరవ సూచకంగా లేచి నిలబడటం, నమస్కారం పెట్టడం లాంటివి కనిపిస్తాయి. కానీ అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రెండు రాష్ట్రాల్లో భారీ విజయం సాధించి, మరో రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేసిన సందర్భంగా.. మోడీని అభినందించేందుకు బీజేపీ ఎంపీలు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.

When Jai Shri Ram slogans greeted PM Narendra Modi in Lok Sabha

సమావేశాల ప్రారంభం అయిన కొద్దిసేపటికి ప్రధాని మోడీ సభలోకి అడుగు పెట్టారు. మోడీని చూడగానే బీజేపీ పార్లమెంట్‌ సభ్యులు నిలబడి బల్లలు చరిచారు.

కొందరు బీజేపీ ఎంపీలు భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. బీజేపీ ఎంపీలతో పాటు బిజు జనతాదళ్‌కు చెందిన వైజయంత్‌ పాండా కూడా బల్లను చరుస్తూ.. మోజీరి స్వాగతం పలికారు. 10 నిమిషాల తర్వాత ప్రధాని లోకసభ నుంచి వెళ్లిపోయారు.

English summary
Prime Minister Narendra Modi was given a grand welcome by BJP members in the Lok Sabha on Wednesday amid slogans of "Jai Shri Ram" and "Modi Modi".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X