డెడ్లైన్: శశికళకు ముందే చెప్పిన జ్యోతిష్కుడు, నాడు జయకూ..
అన్నాడీఎంకే అధినేత్రి శశికళ భవిష్యత్తును ఆమె జ్యోతిష్కుడు ముందే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె దురదృష్టమో.. మరొకటో కానీ ఆమె ముఖ్యమంత్రి ఆశలు దాదాపు కలలు కల్లలు అయ్యాయనే చెప్పవచ్చు.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ భవిష్యత్తును ఆమె జ్యోతిష్కుడు ముందే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె దురదృష్టమో.. మరొకటో కానీ ఆమె ముఖ్యమంత్రి ఆశలు దాదాపు కలలు కల్లలు అయ్యాయనే చెప్పవచ్చు.
రివ్యూ పిటిషన్ కోరితే ఆమె ఏ మేరకు విజయం సాధిస్తారనేది అనుమానమే. నేటి సుప్రీం కోర్టు తీర్పు ద్వారా.. ఆమె పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది.
సీఎం పీఠంపై శశికళ మరో ఎత్తు: పన్నీరుకు ఉద్వాసన, తెరపైకి పళనిస్వామి
గత వారం జ్యోతిష్కుడు శశికళకు ఓ సూచన చేశారని తెలుస్తోంది. ఫిబ్రవరి 14వ తేదీ లోపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పారని తెలుస్తోంది. ఆమె కనుక ఈ లోగా ముఖ్యమంత్రి పదవి చేపట్టకుంటే ఇక జీవితంలో ఆ పోస్టును పొందలేరని చెప్పారని తెలుస్తోంది.
జ్యోతిష్కుడు చెప్పిన ఆ గడువు నాడే సుప్రీం కోర్టు అక్రమాస్తుల కేసులో తీర్పు రావడం గమనార్హం. ఈ తీర్పు నేపథ్యంలో ఆమె సమీప భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు.
మొత్తంగా ఆమె జైలు శిక్ష అనుభవించే నాలుగేళ్లకు తోడుగా, మరో ఆరేళ్ల పాటు పోటీకి అనర్హురాలు.
మరో ప్రమాదం!: పన్నీరుకు ఊహించని షాకిచ్చిన శశికళ
శశికళకు జ్యోతిష్కుల పైన విశ్వాసం. ఆశక్తికర విషయమేమంటే జయలలిత కూడా నమ్మేవారు.
2001లో జయలలిత ఓ కేరళ జ్యోతిష్కుడిని ఆశ్రయించారు. అఫ్పుడు ఆమె ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలిగా ఉన్నారు.
హెల్త్ ట్విస్ట్: సుప్రీం కోర్టును 4వారాల సమయమడిగిన చిన్నమ్మ
భవిష్యత్తులో మీరు ముఖ్యమంత్రి అవుతారని జయలలితకు సదరు కేరళ జ్యోతిష్కుడు చెప్పారు. సదరు జ్యోతిష్కుడి మాటలు నిజమయ్యాయి. ఆ తర్వాత ఆమె సీఎం అయ్యారు. జయ సంతోషంతో ఆయనకు పార్టీ తరఫున రూ.10 లక్షలు ఇచ్చారు. ఆ జ్యోతిష్కుడి పేరు పీయు పణిక్కర్. అతని జోస్యం పట్ల జయలలితకు విశ్వాసం ఎక్కువ.