ఇంతకీ లోక్ పాల్ ఎంపిక ఎప్పుడు ? ఆలస్యానికి కారణమేంటీ ?
హైదరాబాద్ : లోక్ పాల్ వ్యవస్థ దేశంలో అమలవుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బిల్లు పార్లమెంట్ లో పాసైనా .. లోక్ పాల్ నియమాక చర్య చేపట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. లోక్ పాల్ నియామాక ప్రక్రియకు ఆలస్యం ఎందుకవుతోందని సుప్రీంకోర్టు కూడా అటార్నీ జనరల్ ను అడిగింది. లోక్ పాల్ ఎంపికకు సంబంధించిం సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది.

నియామకం ఎప్పుడో ..
లోక్ పాల్, సభ్యుల నియామకం జాప్యం జరుగుతోంది. దీంతో లోక్ పాల్ ఎంపిక ప్రక్రియకు 10 రోజుల్లోగా సమాచారం ఇవ్వాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. వీరి నియామకంపై కమిటీ ఎప్పుడు సమావేశమవుతుందో చెప్పాలని కోరింది. ఈ సందర్భంగా లోక్ పాల్ సభ్యుల నియామాకానికి సంబంధించి జస్టిస్ రంజాన్ ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ మూడు ప్యానెళ్ల పేర్లను చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనానికి సిఫార్సు చేసినట్టు ఏజీ తలిపారు.
అలా ఎలా ?
ప్రధానమంత్రి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ త్వరగా సమావేశమయ్యేలా డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కార్యదర్శిని కోరుతామని పేర్కొన్నారు. సెర్చ్ కమిటీ సిఫార్సు చేసిన మూడు ప్యానెళ్ల పేర్లను బయటపెట్టాలని ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. లోక్ పాల్ నియామకంపై జాప్యం చేస్తూ కేంద్రప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని కామన్ కాజ్ ఎన్జీవో వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.












Click it and Unblock the Notifications