బెదిరింపులు మమ్మల్నేం చేయలేవు! : సలహుద్దీన్ కు వెంకయ్య కౌంటర్
హైదరాబాద్ : భారత్ పట్ల హిజ్బూల్ ముజాహిద్దీన్ నేత సయిద్ సలహాద్దీన్ హెచ్చరికలపై తీవ్రంగా స్పందించారు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు. కశ్మీర్ స్వతంత్రం కోసం పాకిస్తాన్ మద్దతునిచ్చినట్లయితే రెండు దేశాల మధ్య న్యూక్లియర్ వార్ తప్పదంటూ.. సలహాద్దీన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు.
కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడానికి అసలు సలహుద్దీన్ ఎవరు.. అని ప్రశ్నించిన వెంకయ్య, కశ్మీర్ పై మాట్లాడే హక్కు అతనికి లేదని స్పష్టం చేశారు. అసలు కశ్మీర్ పై మాట్లాడే హక్కు అతనికి ఎవరిచ్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకయ్య.

కేవలం పబ్లిసిటీ పాకులాట కోసమే సలహుద్దీన్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాడని, ఇలాంటి వ్యక్తులను వెనుకేసుకు రావడం సరైందా కాదా అన్నది పాక్ తేల్చుకోవాలని సూచించారాయన. అలాగే సలహుద్దీన్ బెదిరింపులు తమను ఏమి చేయలేమని చెప్పుకొచ్చారు వెంకయ్య.
More From
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications