మ్యాగీ నూడుల్స్ వివాదం: చిక్కుల్లో నటి మాధురీ దీక్షిత్
డెహ్రాడూన్: ప్రముఖ బాలీవుడ్నటి మాధురీ దీక్షిత్ వివాదంలో చిక్కుకున్నారు. మ్యాగీ నూడుల్స్లో మోనో సోడియం గ్లూటామేట్ (ఎంఎస్ జీ) ఉందంటూ వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ ప్రకటనలో నటించిన మాధురీకి ఉత్తరప్రదేశ్ ఆహార, ఔషధ సంస్థ నోటీసులు జారీచేసింది.
రెండు నిమిషాల్లోనే ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకం సిద్ధమంటూ ప్రకటనలో కనిపించిన మాధురీ పదిహేను రోజుల్లో ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. లేని పక్షంలో ఈ బాలీవుడ్ నటిపై కేసు నమోదు చేస్తామని యూపీ ఆహార భద్రత అధికారి మహిమానంద్ జోషి తెలిపారు.

మ్యాగీలో పరిమితికి మించి అనారోగ్యకారకాలున్నాయని వస్తున్న ఆరోపణల విషయంలో నెస్ట్లె ఇండియాపై విచారణ జరిపించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థను కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఆదేశించారు.
అంతేకాకుండా, జాతీయ వినియోగదారుల వివాదాలు, పరిహారాల సంస్థ (ఎన్సీడీఆర్సీ)తో ‘క్లాస్ యాక్షన్ సూట్' దాఖలు చేయించాలన్నారు. అయితే తమ గ్రూప్పై వచ్చిన ఆరోపణలను నెస్ట్లె ఇండియా ఖండించింది.
More From
-
ఆశా భోంస్లే 'స్వర' సామ్రాజ్యం.. ఆస్తుల గురించి షాకింగ్ నిజాలు! -
లెజెండరీ గాయని "ఆశాభోస్లే" ఎవరి పాటలు వింటారో తెలుసా..? -
ఆశా భోస్లే చివరి వీడియో వైరల్.. కదిలిస్తున్న దృశ్యాలు! -
"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ??? -
శోకసంద్రంలో చిత్రసీమ, లెజెండరీ సింగర్ కన్నుమూత! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ












Click it and Unblock the Notifications