మ్యాగీ నూడుల్స్ వివాదం: చిక్కుల్లో నటి మాధురీ దీక్షిత్
డెహ్రాడూన్: ప్రముఖ బాలీవుడ్నటి మాధురీ దీక్షిత్ వివాదంలో చిక్కుకున్నారు. మ్యాగీ నూడుల్స్లో మోనో సోడియం గ్లూటామేట్ (ఎంఎస్ జీ) ఉందంటూ వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ ప్రకటనలో నటించిన మాధురీకి ఉత్తరప్రదేశ్ ఆహార, ఔషధ సంస్థ నోటీసులు జారీచేసింది.
రెండు నిమిషాల్లోనే ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకం సిద్ధమంటూ ప్రకటనలో కనిపించిన మాధురీ పదిహేను రోజుల్లో ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. లేని పక్షంలో ఈ బాలీవుడ్ నటిపై కేసు నమోదు చేస్తామని యూపీ ఆహార భద్రత అధికారి మహిమానంద్ జోషి తెలిపారు.

మ్యాగీలో పరిమితికి మించి అనారోగ్యకారకాలున్నాయని వస్తున్న ఆరోపణల విషయంలో నెస్ట్లె ఇండియాపై విచారణ జరిపించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థను కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఆదేశించారు.
అంతేకాకుండా, జాతీయ వినియోగదారుల వివాదాలు, పరిహారాల సంస్థ (ఎన్సీడీఆర్సీ)తో ‘క్లాస్ యాక్షన్ సూట్' దాఖలు చేయించాలన్నారు. అయితే తమ గ్రూప్పై వచ్చిన ఆరోపణలను నెస్ట్లె ఇండియా ఖండించింది.
More From
-
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ! -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు











Click it and Unblock the Notifications