యెడ్డీ ఎఫెక్ట్: శర్మ ట్రావెల్స్ బస్సులనే కాంగ్రెస్ ఎందుకు వాడిందంటే?
హైదరాబాద్: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు మారుతున్నాయి. అయితే తమ క్యాంపులో ఉన్న కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలను రక్షించుకొనేందుకుగాను కాంగ్రెస్, జెడి(ఎస్) నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను శర్మ ట్రావెల్స్ కు చెందిన బస్సుల్లో హైద్రాబాద్ కు శుక్రవారం నాడు ఉదయం తరలించారు.
వాస్తవానికి కాంగ్రెస్, జెడి(ఎస్) పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను హైద్రాబాద్ తరలించడానికి ముందుగా వారిని కేరళకు తరలించాలని భావించారు. కేరళలోని రిసార్ట్స్ ను కూడ బుక్ చేశారు. అయితే చివరి క్షణంలో ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలను బస్సుల్లో హైద్రాబాద్ కు తరలించారు.

కర్ణాటక ఎమ్మెల్యేలను శర్మ ట్రావెల్స్ లో హైద్రాబాద్ కు తరలించారు. అయితే శర్మ ట్రావెల్స్ అధినేత డీపీ శర్మ కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకస్తుడు. అందుకే కాంగ్రెస్ , జెడి(ఎస్) లను శర్మ ట్రావెల్స్ లో తరలించారు.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన శర్మ 1980ల్లోనే బెంగళూరుకు వలస వచ్చారు. రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి చెందిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ నేతలతో సంబంధాలు ఏర్పాడ్డాయని అభిప్రాయాలు లేకపోలేదు.
1998లో దక్షిణ బెంగళూరు నుంచి ఎంపీగా శర్మ పోటీ చేశారు. అయితే, అనంత్కుమార్పై లక్షన్నర ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధానమంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావులతో శర్మకు సత్సంబందాలు ఉండేవి. 2001లో శర్మ చనిపోయారు. శర్మ స్థాపించిన బస్సు సర్వీసులు, కార్గో సర్వీసులు ఇంకా కొనసాగుతున్నాయి. భారత్లో లెక్సియా, వోల్వో బస్సు సర్వీసులను పరిచయం చేసింది కూడా ఈ ట్రావెల్సే.
-
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్ను చిత్తు చేసిన సన్రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ !












Click it and Unblock the Notifications