కర్ణాటకలో బీజేపీ విజయం ఖాయం, సిద్ధు పక్క చూపులు అందుకే!: అమిత్ షా
Recommended Video

బెంగళూరు: త్వరలో కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీనే విజయం సాధిస్తుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తమ గెలుపు ఇప్పటికే ఖాయమైపోయిందని అన్నారు.
ఇందుకు కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన నియోజకవర్గాన్ని మార్చుకోవడమే ప్రత్యక్ష నిదర్శనమని అమిత్ షా వ్యాఖ్యానించారు. కిత్తూరులో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా అమిత్ షా మాట్లాడారు.

బీజేపీ హవాను తట్టుకోలేక సిద్ధరామయ్య తన నియోజకవర్గాన్ని మార్చుకుంటున్నారని చురకలంటించారు. ఇది తమ తొలి విజయమని అమిత్ షా అన్నారు. కర్ణాటకలో బీజేపీ విజయం సాధిస్తుందనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదని వ్యాఖ్యానించారు.
మే 12న కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా, సిద్ధరామయ్య తాను ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణ నియోజకవర్గం నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications